“చీకోటి” గుప్పిట్లో నేతల భవిష్యత్ – ఎవరికి ఎసరు !?

ప్రవీణ్ చీకోటి కేసినో బిజినెస్ అడ్డాగా.. హవాలాను రూ. వందల కోట్లలో చేశాడని ఈడీ అధికారులు గుర్తించడంతో అసలు సినిమా రాజకీయాల్లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే తనకు ప్రాణస్నేహితుడని చికోటి చెప్పడమే కాదు ఫోటోలతో సహా వెల్లడించారు. ఇక గుడివాడలో కేసినో నిర్వహణ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ క్రమంలో ఆయనపై ఈడీ దాడులు జరగడం.. లావాదేవీలన్నీ బయటకు లాగాలని నిర్ణయించడంతో రాజకీయంగానూ సంచలనం అవుతోంది.

సోమవారం నుంచి చికోటిని ఈడీ ప్రశ్నించనుంది. దీంతో చాలా మంది రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. రాజకీయభవిష్యత్‌కు ముడిపడిన అంశం కావడంతో చికోటి ఇంటి చుట్టూ ఆయన నేతల అనుచరులు చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు భయపడిపోయి భద్రత కావాలని పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు చికోటి ప్రవీణ్ నిజంగానే తన లావాదేవీలన్నింటినీ ఈడీకి వెల్లడిస్తే రాజకీయ నేతలంతా బుక్కయిపోతారు. ఇలాంటి వారిలో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో చీకోటిని లైట్ తీసుకున్నారు. మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నప్పటికీ.. ఓ జడ్పీ చైర్మన్ కేసినోకి వెళ్లాడని తేలినప్పటికీ అంతగా ప్రభావిత అంశంగా బయటకు రాలేదు. కానీ ఏపీలో మాత్రం చాలా మంది పేర్లతో సహా వెలుగులోకి వస్తున్నాయి. వీరి పేర్లు నిజంగానే చీకోటి ఈడీ అధికారులకు చెప్పినా… వారు హవాలా సొమ్ము ఇచ్చినట్లుగా ఆధారాలు చిక్కినా నోటీసులు జారీ చేయడం ఖాయం. ఈ ఏ ఒక్క రాజకీయ నేతకు నోటీసులు వచ్చినా అది సంచలనం అయ్యే అవకాశం ఉంది. అందుకే చికోటి ఈడీ విచారణపై అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది.

సాధారణంగా ఈడీ విచారణ జరుపుతూంటే వివరాలన్నీ బయటకు వస్తూంటాయి. డ్రగ్స్ కేసుల్లో వాళ్లేం చెప్పారో కథలు కథలుగా ఈడీవర్గాలు మీడియాకు లీక్ చేశాయి.ఇప్పుడు చికోటి వ్యవహారంలో ఇలా చేసినా సంచలనమే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close