రాజకీయం సరే వరద బాధితులకు ఏదీ సాంత్వన !

రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో అట్టుడికి పోతోంది. అనకూల, వ్యతిరేక ప్రచారంతో అటు అధికారపక్షం.. ఇటు ప్రతిపక్షం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాను అదే వాడుకుంటున్నారు. కానీ ఐదు జిల్లాలప్రజలకు ఇదేమీ పట్టడం లేదు. ఎందుకంటే వారి కన్నీటి చుక్కలు తమ సర్వస్వాన్నిలాక్కెళ్లిపోయిన వరదల్లో బొట్లుగా మారిపోతున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. కరెంట్ లేదు. తిండి లేదు. చెప్పుకుందామంటే ఒక్క ప్రభుత్వ అధికారీ రావడం లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితి వరద బాధిత ప్రాంతాల్లో ఉంది. వరదలు ఆగిపోయినప్పటికీ అది సృష్టించిన విలయం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కొన్నివేల మంది ప్రజలు వరద ముంపు భయంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వారంతా రోడ్ల మీద కాలం గడుపుతున్నారు. తిరుపతి పట్టణంలో జరిగిన బీభత్సానికి సగం మంది ప్రజలకు మంచి నీళ్లు కూడా కరవయ్యాయి. రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా పూర్తి స్తాయి కరెంట‌్ సరఫరా చేయలేదు. రాజంపేట నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత దుర్భంగా ఉంది. ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం లేని వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి సొంత ఖర్చుతో ఇంటి దగ్గర అన్నదానం చేయిస్తున్నారు. ఇక రోడ్లు, కరెంట్ సమస్యలను తీర్చడానికి ఎంత కాలం పడుతుందో అర్థం కాని పరిస్థితి.

నెల్లూరులోనూ అంతే ఉంది. నెల్లూరు నగరం సగం నీట మునిగింది. వందల మంది పేదలు తిండి, నీళ్లు కూడా తిప్పలు పడుతున్నారు.తిరుపతిలో రాయల చెరువు కట్ట ఏ క్షణమైనా తెగిపోతుందని అధికారులు చుట్టుపక్క గ్రామాల్లో చాటింపు వేశారు. అంటే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోవాలని చెబుతున్నారు. కానీ ఎలాంటి సహాయ పునరావాస కార్యక్రమాలూ పెద్దగా చేపట్టలేదు. ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి.. సమీక్ష చేసి ఉంటే అధికారులు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు. కానీ సీఎం జగన్ హెలికాప్టర్‌లో వరద ప్రాంతాలను చూసి నేరుగా తాడేపల్లికి వెళ్లిపోయారు.

మరో వైపు వరదల కన్నా ఎక్కువగా మంత్రులు రాజకీయాల మీదనే దృష్టి పెట్టారు. చంద్రబాబును తిట్టడం.. టీడీపీ నేతల్ని విమర్శించడం.. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంతోనే సరి పెడుతున్నారు. ఈ రాజకీయాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకునే దిక్కు కూడా కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close