పోలింగ్ శాతం పెరిగితే టీఆర్ఎస్‌ ఓటమికి ఎలా కారణం అవుతుంది..?

తెలంగాణ ఎన్నికల ఫలితం… ప్రజలు వినియోగించుకునే ఓట్ల శాతం పై ఆధారపడి ఉంటుందని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు. గత ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్ నమోదయింది. ఈ పర్సంటేజీ కన్నా పోలింగ్ పెరిగితే.. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ప్రత్యామ్నాయం కోసం.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారన్నది రాజకీయవర్గాల విశ్లేషణ. దానికి తగ్గట్లుగానే.. లగడపాటి… పోలింగ్ శాతం పెరిగితే.. అధికార పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకిటంచారు.

గత ఎన్నికల్లోలా 68.5 శాతం ఓటింగ్ జరిగితే.. ప్రజాకూటమికే.. స్వల్ప అధిక్యత ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. నాలుగు జిల్లాల్లో కూటమి, మూడు జిల్లాల్లో టీఆర్ఎస్, రెండు జిల్లాల్లో హోరాహోరీగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో పోలింగ్ శాతం తగ్గితే మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే… ఏ విధంగా చూసినా…పోలింగ్ పర్సంటేజీ.. గత ఎన్నికల్లాగనే ఉన్నా.. కొంచెం పెరిగినా.. ప్రజాకూటమికే.. అనుకూలం అని లగడపాటి తన అధ్యయనంలోతేలిందంటున్నారు. ఎంత ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగితే.. ప్రజాకూటమికి అంత ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అదే పోలింగ్ శాతం తగ్గితే.. అధికార పార్టీకి అనుకూలం కాదు. కానీ… హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ, ఎంఐఎం గణనీయమైన సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఓ రకంగా.. టీఆర్ఎస్ కి రెండు దారులు మూసుకుపోయినట్లేనని చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం బాగా తక్కువ నమోదయి.. హంగ్ వస్తే.. మాత్రం.. బీజేపీతోనో.. ఎంఐఎంతోనే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏ విధంగా చూసినా.. ఈ సారి పోలింగ్ పర్సంటేజీనే.. అసలు ఫలితాలను నిర్దేశించబోతున్నది. ప్రజాకూటమి ఎంత ఎక్కువ మందిని.. ఓటింగ్ కేంద్రాల వైపు ఆకర్షించగలుగుతుందో… అంతగా అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close