పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి “పవన్ నీకెంత మంది భార్యలు.. ఎంత మందిని మోసం చేశావు” అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రెస్ క్లబ్ వద్దకు పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ వచ్చారు. పోసాని సంగతి చూస్తామంటూ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.

తన భార్యపై ఎవరో పోస్టులు పెట్టారంటూ పోసాని ఎమోషనల్ అయ్యారు. దానికి పవన్ కల్యాణ్‌ను నిందించారు. తన భార్యంటే తనకు ప్రాణమని.. ఆమె తనకు భార్య మాత్రమే కాదు ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఆమె చనిపోయిన రోజే తాను చనిపోతానని ప్రకటించారు. గతంలో పోసాని భార్యతో ఆయనకు విబేధాలు ఉండేవని.. ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసిందని.. ఇలా పలు రకాలుగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవి ఆయన చదివి ఆవేశం తెచ్చుకుని ప్రెస్‌క్లబ్ లో సమావేశం పెట్టారు.

సమావేశం ముగిసిన తర్వాత కూడా ప్రెస్ క్లబ్ బయట పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉండటంతో పోసానిని సొంతకారులో వెళ్లవద్దని పోలీసులు సూచించారు. తమ కారులోనే ఇంటి దగ్గర దిగబెట్టాలని నిర్ణయించారు. ఆయనకు భద్రత కల్పించి క్షేమంగా కారులో కూర్చుబెట్టి ఇంటి వైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి .. తనకు ఏమైనా అయితే పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని ప్రకటించారు. తాను పవన్ కల్యాణ్‌పై కేసు పెడతానని హెచ్చరించారు. పవన్‌పై పోసాని ఎటాక్‌తో ఈ వివాదం మరింత ముదురుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close