ఏపీ సీఎంను ఎప్పుడూ కలవలేదన్న ప్రవీణ్ చికోటి!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాను ఎప్పుడూ కలవలేదని.. తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ చికోటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండో రోజు ఆయన సీసీఎస్ పోలీసుల్ని కలిశారు. ఏపీలో వైసీపీ నేతలతో తనకు పరిచయాలున్నాయని.. వారి వ్యవహారం అంతా తాను బయట పెట్టబోతున్నట్లుగా సోషల్ మీడియా అకౌంట్లలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రాజకీయ స్వార్ధం కోసం అపోజిషన్ పార్టీలు చేస్తున్న కుట్రగా అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. తాను అధికార పార్టీకి చెందిన వ్యక్తి అన్నట్లుగా ఆయన మాట్లాడి.. ప్రతిపక్షాలు అంటూ.. ఆరోపణలు చేయడం గమనార్హం. తాను చేసినట్లుగా సోషల్ మీడియా లో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించాలని పోలీసు లను కోరారు. ఫేక్ అకౌంట్ వల్ల తాను చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నానని తెలిపారు. పబ్లిక్ లో, మీడియా ముందు ఈ ఫేక్ అకౌంట్ వల్ల తాను బద్నాం అవుతున్నానన్నారు. వీలయినంత త్వరగా నిందితుడిని పట్టుకోవాలన్నారు.

అయితే ప్రవీణ్ చికోటికి ఏపీ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయనే గతంలో చెప్పారు. వల్లభనేని వంశీ తనకు ప్రాణస్నేహితుడని ఇంటర్యూల్లో చెప్పారు. పలువురు వైసీపీ నేతలు కేసినోలకు చికోటి ద్వారానే వెళ్లేవారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఈడీ .. ఇలాంటి ప్రచారంలో నిజం ఎంతో తేల్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలను బయటకు తీసి… ఇందులో వైసీపీ నేతలు ఉంటే వారికి నోటీసులు ఇస్తారు. లేకపోతే లేదు. అయితే ఫేక్ అకౌంట్ అంటూ చికోటి ఏపీ ప్రతిపక్షాలపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. రాజకీయం అయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close