మోడీకి దేశాలు తిరిగేందుకు టైం ఉంది కానీ…

బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం చెందడం, వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, తెరాసలకు ఒక బలమయిన ఆయుధాన్ని అందిస్తే, బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీజేపీ ఓడిపోగానే అందరికంటే ముందుగా తెరాసకు చెందిన మంత్రి కే. తారక రామారావు స్పందించేరు. “బిహార్ ఎన్నికలలో గెలవడానికి లక్షల కోట్లు మోడీ ఇవ్వజూపినప్పటికీ, బిహార్ ప్రజలు నిర్ద్వందంగా బీజేపీని తిరస్కరించారని, అంతిమంగా నీతి నిజాయితీ సమర్ధమయిన పరిపాలనకే బిహార్ ప్రజలు మొగ్గు చూపారని” కేటీఆర్ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల నేపధ్యంలో కేటీఆర్ ‘నీతి నిజాయితీ సమర్ధమయిన పరిపాలన’ గురించి ఎందుకు మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూడు రోజుల పర్యటన కోసం మోడీ బ్రిటన్ దేశానికి వెళ్ళడాన్ని కూడా కేటీఆర్ వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి చాలా తెలివిగా ఉపయోగించుకొన్నారు.

“ప్రధాని నరేంద్ర మోడికి విదేశాలు వెళ్ళడానికి తీరిక ఆసక్తి ఉంటాయి కాని కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం ఎలా ఉందో తెలుసుకొనేందుకు తీరిక ఆసక్తి లేవు. ఆయన ప్రధాని అయిన తరువాత ఒక్కసారి రాష్ర్టంలో పర్యటించలేదు. రాష్ట్రానికి రాకపోయినా అవసరమయిన నిధులు విడుదల చేసినా బాగుండేది. అదీ చేయడం లేదాయన. పత్తి రైతుల దయనీయమయిన పరిస్థితి గురించి కేంద్రానికి ఎన్ని లేఖలు వ్రాసినా స్పందన లేదు,” అని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మోడీ ప్రభుత్వంపై చేస్తున్న ఈ ఆరోపణలకు వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీ నేతలు జవాబు చెప్పుకోవడం కష్టమే. సాక్షాత్త్ ప్రధాని మోడీకే తెలంగాణా రాష్ట్రం పట్ల ఆసక్తి లేనప్పుడు ఇక బీజేపీలో కొత్తగా జేరి పోటీ చేస్తున్న డా. దేవయ్య మాత్రం ఏమి చేయగలరనే అభిప్రాయం ప్రజలకి కల్పించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని అర్ధం అవుతోంది. మరి ఆయన ఆరోపణలకి బీజేపీ నేతలు ఏవిధంగా సమాధానం చెపుతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close