“ఎన్‌కౌంటర్ శిక్ష”ల డిమాండ్లతో ఉద్యమాలు..!

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ దేశంలో కొత్త తరహా ఉద్యమాలకు కారణం అవుతోంది. రేప్ కేసులు నమోదైన చోటల్లా.. నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఎక్కడిక్కడ ఊపందుకుంటున్నాయి. తెలంగాణలో కూడా… మరో ఎన్ కౌంటర్ డిమాండ్‌తో.. ప్రజలు రోడ్లెక్కారు. ఆదిలాబాద్ జిల్లాలో… టేకు లక్ష్మి దళిత మహిళను.. కొంత మంది యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. దిశ ఘటన జరిగినప్పుడే ఇది కూడా జరిగింది. కానీ మీడియాలో హైలెట్ కాలేదు. వారు అత్యంత నిరుపేదలు కావడం… మరుమూల గ్రామంలో జరగడంతో.. ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ఎప్పుడైతే.. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారో.. అప్పుడే.. సోషల్ మీడియాలో ఉద్యమం ప్రారంభమయింది. దళిత మహిళ అనే కారణంగానే న్యాయం చేయడంలో నిరాదరణ చూపిస్తున్నారా.. అంటూ… ప్రజలు రోడ్డెక్కారు. నిన్న బంద్ కూడా నిర్వహించారు. రాజకీయ నేతల పరామర్శలు కూడా.. టేకు లక్ష్మి కుటుంబానికి ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో మాత్రమే కాదు.. దేశంలో ఇతర చోట్ల కూడా.. అవే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సినీ నటి ప్రత్యూష తల్లి, వైఎస్ హయాంలో దారుణహత్యకు గురైన ఆయేషా మీరా తల్లి లాంటి వారు తెరపైకి వచ్చారు. తమ కూతుళ్లపై దారుణాలకు పాల్పడిన వారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరో ఘటన.. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి సజీవ దహనం. వారిని కూడా.. ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. రేప్ కేసుల్లో ఉన్న నిందితులందర్నీ.. అలాగే శిక్షించాలని… చటాన్ పల్లి ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అందరికీ అదే న్యాయం అమలు చేయాలంటున్నారు.

ప్రజలు భావోద్వేగంలో ఉన్నారు. వారు చంపేయాలని డిమాండ్ చేశారు. చంపేయలేకపోతే.. తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గారో… ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలనుకున్నారో.. వారి భావోద్వేగాలకు తగ్గట్లుగా వ్యవహించి.. ప్రశంసలు పొందాలనుకున్నారో కానీ.. ఎన్‌కౌంటర్ చేసేశారు. నిందితులు తిరుగుబాటు చేయడం వల్ల.. ఆ ఎన్‌కౌంటర్ జరిగిందని..ఒక్కరంటే ఒక్కరూ నమ్మడం లేదు. కావాలనే చేశారని.. అందరూ అంటున్నారు. ఇప్పుడా భావోద్వేగం అన్ని రేప్ కేసుల్లోనూ కనిపిస్తోంది. విచారణలాంటివేమీ లేకుండా… ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ఇదే చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close