అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు.వారు పవర్ ఇస్తేనే ఎవరైనా కిరీటాలు పెట్టుకుంటారు. వారినే టేకిట్ గ్రాంట్ అన్నట్లుగా పరిగణిస్తే ఓటుతోనే పవర్ తీసేస్తారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రె్డి తనను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని.. తాను ఏం చేసినా ప్రజలు తనను దించరన్న ఓ నమ్మకంతో ఉన్నారు. అది ఎంతగా అంటే.. చివరికి తమ ఆస్తులు.. కుటుంబాలను కూడా ఆయన సమర్పించుకుని ఆయన పడేసే ఎంగిలి మెతుకులు తిని బతికేస్తారని అనుకుంటున్నారు. కానీ తాను అధికారం ఇస్తేనే కుర్చీలో కూర్చున్న పాలకుడు.. తమను అలా అంచనా వేస్తున్నాడని అర్థం చేసుకున్న తర్వాత ఊరుకుంటారా ?

నిజానికి జగన్ రెడ్డి ఒక్క సారి తల పైకెత్తి చూసుకుంటే.. తాను చేసిన తప్పేంటో తెలిసిపోతుంది. అధికారం వచ్చిందని అందర్నీ దూరం చేసుకున్నారు. తల్లి, చెల్లి మాత్రమే కాదు హితులు, స్నేహితులు, బంధువులు అందరూ దూరమయైపోయారు. ఇప్పుడు తనకు అధికారం ఉంది కాబట్టి.. సంపాదన ఆశతో ఉన్న కొంత మంది తన చుట్టూ ఉంటారు. కానీ.. రేపు అధికారం పోతే వారు కూడా ఉండరు. అది జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది.

మొత్తంగా అధికారం రావడం గెలుపు కాదని.. ఒక్కో సారి డిజాస్టర్ అని జగన్ మోహన్ రెడ్డి నిరూపించబోతున్నారు. మొదట అధికారం వచ్చింది.. దాన్ని చూసుకుని సర్వం పోగొట్టుకున్నారు.. చివరికి ఆ అధికారం కూడా పోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close