బీజేపీ తరపున ప్రచారానికి పురందేశ్వరి, జీవిత

గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నేతలను కూడా తీసుకువచ్చి ప్రచారం చేయిస్తున్నాయి. బీజేపీ తరపున ఇప్పటికే నటి జీవిత ప్రచారం ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం నుండి డి.పురందేశ్వరి కూడా ప్రచారం చేయబోతున్నారు. నటి జీవిత తన ప్రచారంలో తెరాసపై నిశితంగా విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.

కేంద్రప్రభుత్వం అన్ని విధాలా చాలా సహాయం చేస్తునందునే తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయగలుగుతోందని ఆమె అన్నారు. కేంద్రం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మంచి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి పూర్తి చేయగలదా? అని ఆమె ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి పేర్కొనకుండా తెలంగాణా రాష్ట్రాన్ని కేవలం తమ ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లుగా తెరాస నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారని ఆమె విమర్శించారు.

నేటి నుంచి ప్రచారం చేయబోయే పురందేశ్వరి కూడా బహుశః అదే విధంగా చెప్పవచ్చును. అదే నిజం కూడా. కానీ బీజేపీ నేతల నిరాసక్తత లేదా అశ్రద్ధ కారణంగా కేంద్రప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకి ఇంత వరకు ఎంత మొత్తం విడుదల చేసింది. ఏ ఏ ప్రాజెక్టులకు, అభివృద్ధి, సంక్షేమ పధకాలకు అనుమతులు, నిధులు మంజూరు చేసింది? ఇంకా మున్ముందు ఏమేమీ చేయబోతోంది? వంటి వివరాలను ఎప్పటికప్పుడు గట్టిగా చెప్పుకోకపోవడం చేతనే, ఆ క్రెడిట్ ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాలో రాసేసుకొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోను బీజేపీ నేతల పరిస్థితి ఇదే. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు తడబడుతుంటారు. కనీసం ఇప్పటికయినా వారు మేల్కనకపోయినట్లయితే చివరికి వారే నష్టపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close