స‌డ‌న్ గా డ్రాప్ అయిన ద‌ర్శ‌కేంద్రుడు

`ఓం న‌మో వేంక‌టేశాయ‌` త‌ర‌వాత రాఘ‌వేంద్ర‌రావు మెగాఫోన్‌కి దూరం అయ్యారు. అదే ఆయ‌న చివ‌రి చిత్ర‌మ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ సినిమా ఫ్లాప్‌. ఓ పరాజ‌యంతో.. ఓ అద్భుత‌మైన కెరీర్‌కి ముగింపు ప‌ల‌క‌డం ఇష్టం లేని ద‌ర్శ‌కేంద్రుడు, మ‌ళ్లీ త‌న స్టైల్ లో ఓ సినిమా చేయాల‌ని, దాన్ని హిట్ చేశాకే, స‌గ‌ర్వంగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌ని భావించారు.

ఇటీవ‌లే `పెళ్లిసంద‌D` పేరుతో ఓ సినిమా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకి రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడ‌ని చెప్పారు. అయితే స‌డ‌న్ గా.. ద‌ర్శ‌కేంద్రుడి ప్లాన్ మారింది. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ని గౌరీ రోన‌కి కి అప్ప‌గించారు. ద‌ర్శ‌కేంద్రుడు కేవ‌లం ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌కే ప‌రిమితం అయ్యారు. హీరోగా శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్‌ని ఎంచుకున్నారు. ఇది యూత్ ఫుల్ సినిమా. అందులోనూ ప్రేమ‌, పెళ్లి క‌థ‌. అందుకే.. యువ‌త‌రానికే ద‌ర్శ‌క‌త్వం అప్ప‌గించాల‌ని రాఘ‌వేంద్ర‌రావు భావించారు. అయితే.. త‌న ప్లాన్ ప్ర‌కారం.. ద‌ర్శ‌కుడిగా త‌న చివ‌రి సినిమా తీస్తార‌ట‌. అయితే అది కొత్త వాళ్ల‌తో కాకుండా, స్టార్స్‌తోనే చేయాల‌ని అనుకుంటున్నారు. అందుకే `పెళ్లి సంద‌డి` నుంచి ఆయ‌న డ్రాప్ అయిన‌ట్టు స‌మాచారం. ఈచిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close