జగన్ జైలుకెళ్లాకే ఏపీకి రఘురామ..!

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు భీకరమైన శపథం చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసును తేల్చే వరకూ తాను ఏపీలో అడుగు పెట్టబోనని ప్రకటించారు. జగన్ రాముడో.. రావణుడో తేలేవరకు ఏపీలో కాలుపెట్టబోనని ప్రకటించారు. జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ.. సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. అయితే పిటిషన్‌ ప్రొసీడింగ్స్‌ సరిగా లేవని.. సరైన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటిషన్‌ను సీబీఐ కోర్టు రిట్నర్‌ చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే.. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రెస్ మీట్ పెట్టి రఘురామకృష్ణరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

ఆ తర్వాత రఘురామకృష్ణరాజు .. మీడియా సమావేశం పెట్టి తన చాలెంజ్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకెళ్లిన తర్వాతే తాను ఏపీలో అడుగుపెడతానన్నట్లుగా పరోక్షంగా సవాల్ చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు తనను చంపే కుట్ర పన్నారని ఆరోపించారు. తన కోసం కడప బ్యాచ్‌ను దించాలనుకుంటున్నారని ప్రధానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. వైసీపీతో విబేధించినప్పటి నుండి రఘురామకృష్ణరాజు నర్సాపురం వెళ్లడం లేదు. ఆయన నర్సాపురం వస్తే అరెస్టులు చేయడానికి వీలుగా ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులు నమోదయ్యాయో ఎవరికీ తెలియదు.

అయితే అరెస్టు చేయకుండా… రఘురామకృష్ణరాజు స్టే తెచ్చుకున్నారు. అయినప్పటికీ.. సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి సంకోచిస్తున్నారు. ఇప్పుడు.. జగన్ బెయిల్ రద్దు చేసే మిషన్ ను పెట్టుకున్న ఆయన .. అది తేల్చుకున్న తర్వాతనే … ఏపీకి వస్తానని అంటున్నారు. మొత్తానికి రఘురామకృష్ణరాజు.. సొంత పార్టీ అధినేతపై భీకరమైన యుద్ధమే ప్రకటించారని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close