నర్సాపురం గడ్డపై బలప్రదర్శనకు రఘురామ రెడీ !

తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గానికి వస్తే అరెస్టులు చేయిస్తామని బెదిరిస్తూ నాలుగేళ్ల పాటు రఘురామను నియోజకవర్గానికి రాకుండా చేయగలిగారు వైసీపీ అధినేత జగన్ . నియోజకవర్గానికి రాకపోయినా రఘురామ మాత్రం జగన్ రెడ్డిని ఎప్పుడూ వదిలి పెట్టలేదు. ఇప్పుడు నర్సాపురం నడిబొడ్డున నుంచే జగన్ రెడ్డికి చాలెంజ్ విసరబోతున్నారు. ఈ సంక్రాంతికి ఆయన బలప్రదర్శన చేయబోతున్నారు.

ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా అరెస్టు చేసేందుకు వీలు లేకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వలు తెచ్చుకున్నారు రఘురామ. తెలియకుండా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారని.. రక్షణ కల్పించాలని రఘురామ..తనపై ఇంత వరకూ చేసిన తప్పుడు కేసుల వ్యవహారం.. సీఐడీ ఓ సారి అదుపులోకి తీసుకుని ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశాన్నీ వివరించారు. వాదనలు విన్న హైకోర్టు రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసుల విషయంలో 41ఏ సెక్షన్ విధివిధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, అరెస్ట్ నుంచి రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఓ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. రఘురామ నాలుగేళ్ల తర్వాత నియోజవకర్గానికి వస్తూండటంతో బలప్రదర్శన చేస్తున్నారు.

ఎయిర్ పోర్టులో ధిగ్గినప్పటి నుంచి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. నాలుగేళ్ల పాటు ఆజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మరింత బలంతో ఆయన జగన్ రెడ్డికి సవాల్ విసిరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు జగన్ రెడ్డి ఆయనను టచ్ చేయలేరు. సీఐడీ అధికారులు కూడా ఏమీ చేయలేరు. కానీ రఘురామ మాత్రం తాము చేయాలనుకున్నది చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close