జగన్‌కూ ఇదే పరిస్థితి వస్తుంది : రఘువీరారెడ్డి

జగన్ రెడ్డికి కూడా త్వరలోనే జైలుకెళ్లే పరిస్థితి వస్తుందని పీసీసీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న ఎన్.రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన ాయన.. బీజేపీ ఒత్తిడితోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టిన ప్రయోజనం శూన్యమని… చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని… కాబట్టి టీడీపీ కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. బీజేపీ, ప్రధాని మోదీ , అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని అన్నారు. వీటన్నింటికీ మూల కారణం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడాలన్నది ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఏదో ఒకరోజు జగన్‌కు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండదని రఘువీరారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ ప్రమేయం ఉందని చాలా మంది ప్రచారం చేస్తున్నారు కానీ..అసలు విషయం మాత్రం క్లారిటీ లేదు.

కానీ కేంద్రం వైపు నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి స్పందన రాలేదు. ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఖండించారు. బండి సంజయ్ లాంటి వారు జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని విమర్శించారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో కాంగ్రెస్ నేతల ఎక్కువగా బీజేపీనీ ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా.. చంద్రబాబు బీజేపీతో కలిసి వెళ్లకుండా అలా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అరెస్టుపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎవరూ అవి అవినీతి కేసులని అనడం లేదు. ఖచ్చితంగా రాజకీయ కేసులంటున్నారు. వీటిని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close