బీజేపీ ఆఫీసులో రఘురామకృష్ణంరాజు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆకస్మికంగా.. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన అక్కడ ఎవరితో.. ఏ అంశంపై చర్చించారో బయటకు రాలేదు కానీ… దాదాపుగా గంటకుపైగా.. ఆయన … బీజేపీ కార్యాలయంలో.. గడిపినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు పార్లమెంట్ జరుగుతున్న సమయంలో… ఆయన ఇలా బీజేపీ ఆఫీసు వైపు రావడం .. ఇతర ఎంపీలను ఆశ్చర్యానికి గురి చేసింది.

విజయసాయిరెడ్డికి, మిధున్ రెడ్డికి చెప్పకుండా.. కేంద్ర మంత్రులకే కాదు.. నేరుగా ప్రధానిని కూడా కలవవద్దని.. జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని స్పష్టం చేశారు. కానీ.. రఘురామకృష్ణంరాజు మాత్రం.. లోక్‌సభలో తొలి రోజే… మాతృభాషకు అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆయనను సెంట్రల్ హాల్‌లో ఆప్యాయంగా పలకరించడంతో పరిస్థితి మారిపోయింది. వెంటనే.. జగన్మోహన్ రెడ్డి… అమరావతి పిలిపించి.. వివరణ తీసుకున్నారు. అంతకు ముందు సుజనా చౌదరి… వైసీపీకి చెందిన ఎంపీలు కొంత మంది టచ్‌లో ఉన్నారని.. తమతో కలిసి రావాలనుకున్న వాళ్లే కలుస్తున్నారని చెప్పి కలకలం రేపారు.

అయితే.. ఈ వ్యాఖ్యలను రఘురామకృష్ణంరాజు తోసి పుచ్చారు. తాము ఎవరితోనూ టచ్‌లో లేమన్నారు. అలా అన్న ఒక్క రోజులోనే… రఘురామకృష్ణం రాజు.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. సాధారణంగా… ఒక పార్టీ ఆఫీసులోనికి మరో పార్టీ ఎంపీలు… అంత తేలిగ్గా వెళ్లరు. మామూలుగా ఏ రాజకీయ వివాదాలు లేకపోతే.. వెళ్లినా ఎవరూ పట్టించుకోరు. కానీ .. రఘురామకృష్ణంరాజు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న ఆరోపణలు వస్తూండగా.. ఆయన తన పని తాను చేసుకోవడంతోనే.. వైసీపీ వర్గాల్లోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close