పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ ఉత్తరాలు రాస్తున్నారు. పేపర్లలో ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాజ్‌నాథ్‌తో భేటీ మరింత ఆసక్తి కరంగా మారింది. అయితే.. రాజకీయ ప్రాథాన్యత లేదని.. తాను ఓ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా ఉన్నందున ఆ పని మీద కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. కానీ రఘురామకృష్ణరాజు.. బీజేపీ నేతలతో పరిచయాలు పెంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తనపై వైసీపీ వేసిన అనర్హతా పిటిషన్.. తన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడబీకేందుకు ప్రయత్నాలు చేస్తూండటం.. వంటి వాంటితో.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ చాలా ముఖ్యమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే.. రఘురామకృష్ణంరాజు తరచూ బీజేపీ పెద్దల్ని కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే సమయంలో.. తాను పార్టీపై ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ వేరు.. ప్రభుత్వం వేరని.. ప్రభుత్వానికి మాత్రం సూచనలు చేస్తున్నానని లాజిక్ వినిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు, ఇసుక సమస్య వంటి వాటిపై ప్రభుత్వానికే సూచనలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అదీ కూడా.. తాను మొదటగా మాట్లాడలేదన్నారు. ఇసుక కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెడుతున్నారూ అంటే.. అందులో తప్పు జరుగుతున్నట్లే కదా.. అని లాజిక్ తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆయన పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారు పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని తానెప్పుడు పార్టీని విమర్శించలేదన్నారు.

మీడియానే మా సంసారంలో నిప్పులు వేయాలని చూస్తోందని, అలాంటి పనులు మానుకోవాలని సూచించారు. వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని రఘురామ స్పష్టంచేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే.. ఆ ఆప్షన్ ను ఉపయోగించుకుందామని.. వైసీపీ చూస్తోంది కానీ.. ఎక్కడా రఘురామకృష్ణంరాజు చాన్సివ్వడం లేదు. పైగా.. ప్రభుత్వానికి .. వరుసగా లేఖలు రాస్తూ.. చికాకు తెప్పిస్తున్నారు. రఘురామకృష్ణరాజును ఎలా డీల్ చేయాలో తెలియక.. వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close