ఏపీ బీజేపీకి దారి చూపిన రఘురామకృష్ణరాజు !

వైసీపీ సర్కార్‌పై ఎలా పోరాడాలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ బీజేపీ నేతలకు దారి చూపారు. ఆ దారిలో సోము వీర్రాజు అండ్ బృందం విమర్శలు ప్రారంభించారు. వైఎస్ జగన్‌కు డబుల్, ట్రిపుల్ స్టికర్ సీఎం అని పేరు పెట్టామని ఆయన ప్రకటించారు. ఎందుకంటే కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటికీ జగన్ పేరు పెట్టుకుంటున్నారట. గత వారం రఘురామకృష్ణరాజు మధ్యాహ్న భోజన పథకంతో పాటు మరికొన్ని పథకాలకు జగనన్న పేరు పెట్టి పంపిణీ చేస్తున్నారని వాటికి నిధులు కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఫిర్యాదు చేశారు.

ఆమె ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసింది. పథకాల పేర్లు మార్పు కుదరదని స్పష్టం చేసింది. ఆయా పథకాలకు ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత రోజు రఘురామకృష్ణరాజు ప్రెస్మీట్ పెట్టి ఎన్నికేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్ పేరు పెట్టుకున్నారో లెక్క చెప్పారు. వాటన్నింటికీ జగన్ పేరు తీసేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు ఆ పథకాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. కేంద్ర నిధులతో పథకాలు చేపట్టి జగన్ బొమ్మ పెట్టుకుంటున్నారని అందుకే ఆయనను డబుల్ స్టిక్కర్.. ట్రిపుల్ స్టిక్కర్ సీఎం అంటున్నామని చెప్పుకొచ్చారు.

గతంలో చంద్రబాబు కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలకు తన పేరు పెట్టుకునేవారు. అప్పుడు బీజేపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ ఇటీవలి వరకు ఏపీ బీజేపీ నేతలు.. జగన్ పేరు పెట్టుకోవడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చురుకుపుట్టినట్లుగా ఉంది. ప్రకటనలు ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close