సీఐడీ సునీల్‌ను ఫిర్యాదులతో రఘురామ భయపెడుతున్నారా..!?

సీఐడీ సునీల్ కుమార్ విషయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన తన ఫోన్‌ను అనధికారివాడారాని ఓ సారి ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని,… దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలన్నింటికీ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన మత విద్వేష వ్యాఖ్యలు చేశారని సీడీలతో సహా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. తర్వాత డీవోపీటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన బయటకు చెప్పకుండా.. మరికొన్ని వ్యవస్థలుకూ సీఐడీ సునీల్‌పై ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. తాజాగా.. ఐపీఎస్ సునీల్ కుమార్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజం నిగ్గు తేల్చి నివేదిక ఇవ్వాల్సింది.. కేంద్ర సిబ్బంది వ్యవహారాలను చూసే డీవోపీటీ విభాగం హోంశాఖను ఆదేశించింది. డీవోపీటీకి సునీల్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది రఘురామకృష్ణరాజునే. ఆయన మత విద్వేష వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదును.. ఆయన డీవోపీటికి పంపారు. దాన్నే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వారు హోంశాఖకు పంపారు. అయితే.. అంతకు ముందే హోంశాఖకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు.

కేంద్ర హోంశాఖ దీనిపై స్పందించింది. ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. రఘురామ లేఖ, సునీల్‌ ప్రసంగ వీడియోల ఆధారంగా.. తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సునీల్ కుమార్ తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వంలో అదనపు డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్.. అంతకు మించి పవర్ ఫుల్ అధికారం చెలాయిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ కూడా నివేదిక ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే.. ఆయనపై ఏ చర్యలూ తీసుకోలేకపోతున్నారు.

రఘురామకృష్ణరాజుకు.. కేంద్రం మద్దతు ఉందో లేదో కానీ.. పీవీ సునీల్‌కుమార్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వ పెద్దల మద్దతు మాత్రం పుష్కలంగా ఉంది. దీంతో ఆయనను భయపెట్టడానికే.. రఘురామ ఫిర్యాదులు చేస్తున్నారని…కానీ ప్రభుత్వ అండ ఉన్నంత వరకూ.. సునీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేరని.. వైసీపీ వర్గాలు.. ప్రచారం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close