విద్యార్థులకు పథకం ఏదైనా “ల్యాప్ ట్యాప్” ఖాయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకో కానీ ల్యాప్‌ట్యాప్‌ల మీద విపరీతమైన అభిమానం చూపిస్తోంది. అలాంటిలాంటి అభిమానం కాదు.. ఎంత వీలైతే అంత మంది భుజాలకు ల్యాప్‌ట్యాప్‌లు తగిలించాలని ప్లాన్ చేస్తోంది. అందు కోసం విద్యార్థుల కోసం ప్రవేశ పెట్టిన పథకాల లబ్దిదారులకు .. ల్యాప్ ట్యాప్ ఇస్తామన్న కబురు పంపుతోంది. అయితే ఉత్తినే కాదు.. పథకాల సొమ్ముకు బదులుగా ల్యాప్ ట్యాప్ ఇస్తామంటోంది. అమ్మఒడి పథకం కింద.. ప్రతీ ఏటా .. విద్యార్థుల తల్లికి రూ. పదిహేను వేలు ఇస్తున్నారు. అందులో వెయ్యి.. ఇతర ఖర్చులకు మినహాయించుకుని రూ. పధ్నాలుగు వేలు ఇస్తున్నారు. ఈ పథ్నాలుగు వేలకు బదులుగా ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ఏడాది కిందటే ప్రకటించారు.

దాని ప్రకారం.. వాలంటీర్లు… లబ్దిదారుల దగ్గర అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. చాలా మంది విద్యార్థుల తల్లులు తమకు వద్దని అనుకుంటున్నారు కానీ.. వాలంటీర్లు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ సర్కార్.. మరో పథకానికి ల్యాప్ ట్యాప్‌ను ముడి పెట్టేసింది. వసతి దీవెన కింద.. విద్యార్థులకు ఇచ్చే మొత్తానికి ల్యాప్ ట్యాప్‌లు తీసుకోవచ్చని పథకంలో ప్లాన్ మార్చింది. అయితే తప్పనిసరేమీ కాదు. వద్దనుకున్న వారికి నగదు ఇస్తారు. కానీ వద్దు అనేంత ధైర్యం లబ్దిదారులకు వాలంటీర్లను చూస్తే వస్తుందా అన్నది తర్వాతి విషయం.

అవసరం అయితే.. ఆ డబ్బులతో లబ్దిదారులే కొనుగోలు చేస్తారు.. ప్రభుత్వం ఎందుకు ల్యాప్‌ట్యాప్‌లు అంటగట్టాలనుకుంటుందో చాలా మందికి అర్థం కాని విషయం. చాలా ఎక్కున కన్ఫిగరేషన్ ఉన్నవి.. మంచి సర్వీస్ సపోర్ట్ ఉన్నవి.. అని ప్రభుత్వమే మార్కెటింగ్ చేస్తోంది. ల్యాప్ ట్యాప్‌కు ప్రాబ్లం వస్తే గ్రామ సచివాలాయాల్లో ఇస్తే చాలని.. రిపేర్ చేయిస్తారని కూడా అంటోంది. ల్యాప్ ట్యాప్ కంపెనీల కోసం అంత ఇదిగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏమిటో కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ అమ్మఒడి, వసతి దీవెన లబ్దిదారుల్లో కనీసం సగం మందికైనా ల్యాప్‌ట్యాప్‌లు కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close