టీడీపీ సీట్లు ఇవ్వనంటున్నా హోదా నినాదం వినిపిస్తున్న రాహుల్..!

ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశంపార్టీ వెనుకడుగు వేస్తున్నా… జాతీయ స్థాయిలో మాత్రమే సహకరిస్తామని… ఏపీలో పొత్తు పెట్టుకోలేమని సంకేతాలు పంపుతున్నా…కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం…ఎక్కడ తెలుగువారు కనిపించినా.. అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతామని హామీ ఇస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌లో ఉన్న రాహుల్‌.. అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిశారు. అక్కడ తెలుగు కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారికి మరోసారి హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధాని మరిచారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా కలిసి భారత ప్రభుత్వానికి, మోదీకి అర్థమయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ… విదేశీ పర్యటనల్లో కాదు.. ఇండియాలో.. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న చోట్ల .. ప్రసంగించాల్సి వచ్చినా.. ప్రత్యేకహోదా హామీ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో.. ఒకే ఒక్క సభలో ప్రసంగించిన సోనియా గాంధీ కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు.ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు వివాదాస్పదం చేశారు. తెలంగాణ గడ్డపై.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించి అవమానించారని విమర్శించారు. అయినా రాహుల్ గాంధీ వెనక్కి తగ్గలేదు. గతంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనల్లోనూ ప్రవాస భారతీయుల్ని ఉద్దేశంచి ప్రసంగించిన సమయంలోనూ ప్రత్యేకహోదా హామీ గురించి ప్రస్తావించారు.

ప్రత్యేకహోదా ఏపీ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. అయితే.. ప్రత్యేకహోదా హామీ ఇచ్చి.. కాంగ్రెస్ బరిలోకి దిగినా.. ప్రయోజనం ఉండే పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జాతీయ స్థాయిలో టీడీపీని మిత్రపక్షంగా ఉంచుకోవడానికి మాత్రం ఈ హామీ ఉపయోగపడుతోంది. ఓ వైపు.. ఏపీలో తమకు ఓట్లు సీట్లు ఏమీ లేవని.. నిధుల విడుదల పట్ల బీజేపీ నిర్లక్ష్యం చూపుతోంది. కానీ.. తమది అదే పరిస్థితి అయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాత్రం.. ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారని.. ఆయన ప్రకటనల ద్వారానే తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close