ప్రత్యేకహోదాకోసం పోరాడతానన్న రాహుల్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్ట్‌కోసం తాను పోరాడతానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి అన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక హోదాను వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు. ఆయన ఇవాళ అనంతపురంజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం బెంగళూరునుంచి కొడికండ చెక్‌పోస్ట్‌కు చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రఘువీరారెడ్డి, చిరంజీవి, పల్లంరాజు, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రామచంద్రయ్య, కేవీపీ, జేడీ శీలం, పనబాక లక్ష్మి తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడనుంచి వారంతా ఓబుళదేవర చెరువుగ్రామం చేరుకున్నారు. రాహుల్ పర్యటనను అడ్డకోవటానికి చంద్రదండు పేరుతో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవటంతో అది సాగలేదు. రాహుల్ గోబ్యాక్ అంటూ వారు నినాదాలు ఇచ్చారు.

ఓబుళదేవర చెరువులో గతంలో 1979లో ఇందిరాగాంధి బహిరంగసభ జరిపిన ప్రదేశంలో రాహుల్ ఒక మొక్కను నాటారు. రాజీవ్ గాంధి, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత అక్కడ జరిగిన బహిరంగసభలో రాహుల్, ఆత్మహత్యచేసుకున్న 45మంది రైతుల కుటుంబాలకు రు.50,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. తర్వాత రైతులు రాహుల్‌కు తమ సమస్యలను ఒక్కొక్కరుగా వివరించారు. కొందరు రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం రాహుల్ ప్రయత్నించాలని కోరారు. ఆ తర్వాత బహిరంగసభనుద్దేశించి మాట్లాడారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదాకోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ఈ రెండు పార్టీలూ ఎందుకు భయపడుతున్నాయని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఏ భయమూ లేదని అన్నారు. ఏపీలోని ఏ గ్రామానికైనా వచ్చి పోరాడతానని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు మేలుచేసేందుకే భూసేకరణబిల్లును మోడి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఆంధ్రాతో ఇందిరాగాంధితో ఉన్న అనుబంధమే తనకూ ఉందని అన్నారు. తర్వాత రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సాయంత్రం రాహుల్ పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి సమాధిని సందర్శిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close