త్వరలో నేనూ సాధారణ పౌరుడయిపోతానోచ్!

నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఇండో గ్లోబల్ హెల్త్ కేర్, ఫార్మా సదస్సులో ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ “నేను త్వరలో సాధారణ పౌరుడునయిపోతా” అని చెప్పడంతో అందరూ ఉలిక్కి పడ్డారు.

ఇదివరకు ఓటుకి నోటు కేసులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆయన ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని తెదేపా నేతలు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొందరు విమర్శలు చేసారు. అదే సమయంలో త్వరలోనే గవర్నర్ మారబోతున్నారనే వార్తలు కూడా వచ్చేయి. అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులే తనపై విమర్శలు గుప్పిస్తుండటంతో కలత చెందిన ఆయన రాజీనామాకు సిద్దపడ్డారని, కానీ కేంద్ర ప్రభుత్వం ఆయనకి నచ్చజెప్పడంతో తన పదవిలో కొనసాగుతున్నారని వార్తలు వచ్చేయి. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్న సమయంలో ఆయన హటాత్తుగా తను పదవిలో నుండి తప్పుకోబోతున్నట్లు ప్రకటించడం అందరినీ చాలా ఆశ్చర్యం కలిగించింది.

రాష్ట్ర విభజనకు ముందు నుంచి నేటి వరకు ఆయన అనేక సమస్యలను, అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఎన్నడూ తన మనసులో బాధను బయటపెట్టుకోలేదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయినా నిబ్బరంగా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చి రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలను, వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రోత్సహించారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ ఓటుకి నోటు కేసు బయటపడటంతో రెండు రాష్ట్రప్రభుత్వాల మధ్య భయంకర యుద్ధం జరిగింది. అటువంటి సమయంలో ఆయనే స్వయంగా తప్పుకొన్నా లేదా కేంద్ర ప్రభుత్వమే ఆయనని తప్పించినా అది ఆయనకు ఏమాత్రం గౌరవప్రదంగా ఉండదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు ఆయన ఇంతవరకు ఆగి ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొన్నాయి కనుక తప్పుకోవాలనుకొంటున్నారేమో? ఏమయినప్పటికీ రెండురాష్ట్రాల సమస్యల గురించి మంచి అవగాహన కలిగి ఉన్న అయన తప్పుకొంటే, ఆయన స్థానంలో మరొకరెవరువచ్చినా ఇంతకంటే ఎక్కువ సమస్యలు సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close