రాహుల్ ఎన్నికల బహిష్కరణ ప్లాన్..! కాంగ్రెస్‌లో కంగారు..!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… సహాయ నిరాకరణ పేరుతో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ .. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం ప్రజలు.. ఓటర్లు కాదని.. కచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లేనని ఆయన నమ్ముతున్నారు. దీనికి సంబంధించి కొంత డేటా ఆయన దగ్గర ఉండటంతో… అసలు బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం కన్నా.. ఈవీఎంలపై పోరాటం చేయడం బెటరని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందని రాహుల్ నమ్మకం..!

రాహుల్ గాంధీ.. ఈవీఎంలపై… తన పోరాటం ప్రజల్లోకి వెళ్లేలా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. అందులో మొదటి.. ఎన్నికల బహిష్కరణ. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని.. బ్యాలెట్లతో ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ తో… ఈ ప్రయత్నం చేయాలని.. నిర్ణయించుకున్నట్లుగా కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతోనే వదిలి పెట్టకుండా.. దేశవ్యాప్తంగా కలసి వచ్చే పార్టీలో భారీ ఉద్యమాన్ని నిర్మించాలని రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈవీఎంలతోనే… బీజేపీ గెలిచిందని… అవి లేకపోతే.. ప్రజాతీర్పు మరోలా ఉంటుందని రాహుల్ గట్టిగా నమ్ముతున్నారు.

బ్యాలెట్‌తో నిర్వహించకపోతే అసెంబ్లీ ఎన్నికల బహిష్కరణ..!

రాహుల్ గాంధీ ఆలోచనలపై.. కాంగ్రెస్‌లోనే… కలకలం రేగింది. అనేక మంది నేతలు… ఈ నిర్ణయం సరి కాదని.. వాదిస్తున్నారు. ఈవీఎంలపై.. ఆరోపణలు చేయడం కన్నా.. ప్రజల్లోకి వెళ్లి పోరాడదామని సూచిస్తున్నారు. అయితే.. సోనియా గాంధీకి కూడా.. ఈవీఎంలపై అనుమానాలున్నాయి. కొద్ది రోజుల కిందట.. మీడియాతో మాట్లాడుతూ.. ఆమె కూడా… ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఈవీఎంలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. ఆమె వాటిని వ్యతిరేకించలేని పరిస్థితి ఉంది. అందుకే.. రాహుల్ సహాయనిరాకరణ ఉద్యమంపై.. ఆమె అంత సానుకూలంగా లేరన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.

కాంగ్రెస్‌లోనూ దొరకని మద్దతు..! ముందడుగు వేస్తారా..?

బ్యాలెట్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ పోరాటం ప్రారంభిస్తే… కచ్చితంగా అది ఆయన ఒంటరిగానే ప్రారంభించాలి. నిజానికి.. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలపై విశ్వసనీయత లేకుండా పోయింది. గెలిచిన వాళ్ల వైపు.. అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో… రాహుల్ గాంధీ… గట్టిగా నిలబడితే.. ఆయన పోరాటానికి మద్దతు లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే… 21 పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అన్నీ కలసి వస్తే.. పోరాటానికి మద్దతు పెరుగుతుంది. ప్రజలు కూడా.. సపోర్ట్ చేస్తే కేంద్రం దిగిరాక తప్పదు. అయితే.. అప్పటి వరకూ రాహుల్ గాంధీ వెటకారాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close