భరోసా నగదు బ్యాంకులో వేసేది కూడా వాయిదాల పద్దతిలోనే..!

రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం రెండు రోజుల కిందట ప్రకటించింది. దీని ప్రకారం…ప్రభుత్వం గుర్తించిన లబ్దిదారులందరికీ.. నగదులు ఈ రోజు బ్యాంకు ఖాతాల్లో పడిపోవాలి. రేపటి నుంచి ఖాతాల్లో వేస్తామని.. సీఎం నెల్లూరులో ప్రకటించారు. అంతే కాదు.. రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ఆయన రైతులకు.. ఓ భారీ చెక్కు నమూనాను అందించారు. అందులో ప్రభుత్వం విడుదల చేసిన రూ. 5,510 కోట్లు లేవు. కేవలం రూ. 3785 కోట్లు మాత్రమే చూపిస్తున్నాయి. అంటే.. దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వరకూ రెండు రోజుల వ్యవధిలోనే లోటు పడిపోయింది. ఆర్థిక శాఖ అంత మొత్తం విడుదల చేసేసిన తర్వాతా ఎందుకు .. తగ్గిపోయాయన్నది అధికారవర్గాలకు మాత్రమే తెలిసిన విషయం.

నిజానికి ఆర్థిక శాఖ రైతు భరోసాకు రూ. 5,510 కోట్లు విడుదల ఉత్తర్వులు జారీ చేసే సమయానికి ప్రభుత్వం… మూడు విడతలుగా.. పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన చేయలేదు. కానీ..రూ. 5,510 కోట్లు విడుదల ఉత్తర్వులిచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద తగినంత నగదు లేదనే విషయం తెలిసింది. వెంటనే.. రైతు ప్రతినిధుల పేరుతో వైసీపీ నేతల్ని పిలిపించి.. వారే మూడు విడతలుగా ఇవ్వాలని కోరినట్లుగా ప్రచారం చేసి.. భరోసాను మూడు ముక్కలుగా చేశారు. దాంతో.. ఇచ్చే మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం రూ. 3785 కోట్లు అవుతుంది. అందుకే.. అంత మొత్తం అంకే వెసి.. జగన్ రైతులకు చెక్కులిస్తున్నట్లుగా ఫోటోలు దిగారు.

రైతు భరోసా కార్యక్రమం… అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ చేశారు. లబ్దిదారులకు చెక్కులిచ్చారు. కానీ ఆ చెక్కులన్నీ డమ్మీ చెక్కులే. అందులో.. రూ. 7500 ఇస్తున్నట్లుగా ప్రింట్ చేశారు. కానీ… అవి బ్యాంకులో వేయడానికి ఉపయోగపడవు రైతుల ఖాతాలకు నేరుగా ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఎప్పుడు చేస్తారనేది అధికారవర్గాలకు అంతుచిక్కని విషయం. వివిధ రూపాల్లో నిధుల సమీకరణను ప్రభుత్వం చేస్తోంది. ఎంత అందుబాటులోకి వస్తే అంత.. అప్పటికప్పుడు బదిలీ చేస్తారు. అంటే.. ఈ బదిలీ నెలాఖరు వరకూ జరగొచ్చని అంచున్నారు. భరోసాకు వాయిదాలే కాదు.. నిరీక్షణ కూడా తప్పదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close