రాజాసింగ్‌ను ఏపీ పైకి ప్రయోగిస్తున్నారా..!?

తెలంగాణలో అతి చిన్న నియోజకవర్గమైన గోషామహల్ నుంచి హిందూత్వ వాదంతో ఎంఐఎంపై గెలుస్తూ వస్తున్న రాజాసింగ్ లోథ్‌ను.. భారతీయ జనతా పార్టీ ఏపీపైకి ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఏపీలోని శ్రీశైలం ఆలయంపై దృష్టి పెట్టి అక్కడి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే కూడా ఆయన స్పందించడమే మహాభాగ్యమన్నట్లుగా… తాను కూడా.. చెలరేగి ప్రకటనలు చేస్తున్నారు.

శ్రీశైలంలోని దుకాణ సముదాయాల కేటాయింపుల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని… కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదనేది ఆయన వాదన. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి..శ్రీశైలం చుట్టుపక్కల ముస్లింలకు ఎక్కువ శాతం షాపులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు..అన్యమతస్థులకు దుకాణాలు ఇవ్వకూడదన్న అంశం దేవాదాయ చట్టంలో స్పష్టంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన అంటున్నారు. రాజా సింగ్ ఆరోపణలకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.హిందూమతాన్ని అడ్డుపెట్టుకొని.. ఏపీలో ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. శ్రీశైలంలో ముస్లింలు 40 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయనన్నారు. సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. రజాక్ అనే వ్యక్తిని తనకు బినామీగా చెప్పడాన్ని ఎమ్మెల్యే ఖండించారు.

నిజానికి శ్రీశైలం అంశాన్ని వివాదాస్పదం చేయడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది కూడా ఇంతే జరిగింది. దుకాణాల వేలం సమయంలో.. దుకాణాలను స్థానికులకు కేటాయించకుండా…ఇతరులకు కేటాయిస్తున్నారంటూ బీజేపీ చలో శ్రీశైలం కార్యక్రమం నిర్వహించారు. వేలం నిలిపివేయడంతో అప్పట్లో వివాదం సద్దు మణిగింది. ఆ తర్వాత మెల్లగా మళ్లీ ముస్లింలకు షాపులు కేటాయించారన్న అనుమానాలున్నాయి. శ్రీశైలం ఆలయం వద్ద పెత్తనాన్ని ఎక్కువగా ఎమ్మెల్యే అనుచరుడు రజాక్ చేస్తూంటారు. దీంతో వైసీపీ నేతలకు సమర్థించుకోవడానికి లేకుండా పోతోంది. కొత్తగా ఘంటామఠం అనే ప్రాంతం తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడ్డాయని బీజేపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close