రజనీకి పగ్గాలిచ్చేందుకే తమిళిసైకి గవర్నర్ పోస్ట్..!?

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని… తమిళిసైకి గవర్నర్ పదవి ఇచ్చి ఖాళీ చేయించిన .. కమలం పెద్దలు.. ఆ స్థానంలో రజనీకాంత్ వస్తారనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు.. తమిళనాడులో విస్తృత ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీ పెడతా..పెడతా అని ఊరిస్తూ వస్తున్న రజనీకాంత్‌ను.. తమిలనాడులో.. బీజేపీనే తన పార్టీగా చేసుకోవాలనే బంపర్ ఆఫర్లు.. మోడీ, అమిత్ షాల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. చాలా కాలంగా… రజనీకాంత్‌తో చర్చలు జరుపుతున్నారని… అందుకే.. ఇటీవలి కాలంలో… రజనీకాంత్ మోడీ, షాలపై అనూహ్యంగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

తమిళనాడులో బీజేపీకి పట్టు చిక్కడం లేదు. అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఓ మాదిరిగా కూడా.. బలం పుంజుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే.. రజనీకాంత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతను చేర్చుకోవాలనే ప్రయత్నాలు చాలా కాలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయం మారింది. జయలలిత, కరుణానిధిలు లక్షల మంది అభిమానులు ఉన్న నేతలు. ప్రస్తుతం అలాంటి జనాకర్షణ ఉన్న నేతలు అటు అన్నాడీఎంకేకు కానీ.. ఇటు డీఎంకేకు కానీ లేరు. అయితే.. డీఎంకేకు స్టాలిన్ గట్టి నాయకుడిగా నిలబడ్డాడు. జయలలిత స్థాయిలో జనాకర్షణ కలిగి నేత రజనీకాంత్. అందుకే… బీజేపీ రజనీపై దృష్టి పెట్టిందని చెబుతున్నారు.

బీజేపీపై రజనీకాంత్ చాలా కాలంగా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. కొన్నాళ్ల తరపున బీజేపీ తరపున ఎంపీగా పోటీచేసిన ఓ నేత.. తాను ఏర్పాటు చేసిన ఎంజీఆర్ విగ్రహం.. ఆవిష్కరణకు.. రజనీకాంత్ ను పిలిచారు. ఆ సభలో మాట్లాడుతూ రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను ఎమ్జీఆర్ పాలన తెస్తానని రజనీకాంత్ ప్రకటించారు. స్టెరిలైట్ పరిశ్రమ కాల్పుల్లో మరణించిన వారిని పరామర్శించడానికి వెళ్లి.. బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. తప్పు ఆందోళన కారులదే అన్నట్లుగా .. ప్రభుత్వానికి బహిరంగ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి… బీజేపీని బలపర్చాలనుకుంటున్న హైకమాండ్.. రజనీకాంత్ పై గురి పెట్టిందంటున్నారు. మరి రజనీకాంత్‌నే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close