రజనీ కాంత్ పాస్ పోర్ట్ మరిచిపోయారు!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పాస్ పోర్ట్ మరిచిపోవడంతో దాని కోసం ఎదురుచూస్తూ నిన్న చెన్నై విమానాశ్రయంలో చాలా సేపు కూర్చోవలసి వచ్చింది. ఆయన నటిస్తున్న ‘కబాలి’ సినిమా షూటింగ్ కోసం కౌలాలంపూర్ కి నిన్న బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ వ్యవహారాలను చూసే ఆయన మేనేజర్ రజనీకాంత్ ఇంటి నుండి పాస్ పోర్ట్ తెచ్చిఇచ్చిన తరువాత మధ్యాహ్నం విమానంలో కౌలాలంపూర్ వెళ్లిపోయారని విమాశ్రయఅధికారులు తెలిపారు. కానీ ఆ మేనేజర్ దీనిని ఖండించారు.

“సాధారణంగా అటువంటి ప్రముఖులు విదేశాలకు వెళుతున్నపుడు మేము వారి టికెట్, పాస్ పోర్ట్, వీసా వంటివన్నీ సరిచూసుకొని, సదరు ప్రముఖుల కంటే చాలా ముందుగానే విమానాశ్రయం వద్దకు చేరుకొని వారి కోసం ఎదురు చూస్తుంటాము. కానీ నిన్న రజనీ కాంత్ మాకంటే కొంచెం ముందుగా విమానాశ్రయం చేరుకోవడంతో ఈ విధంగా జరిగడంతో ఆయన పాస్ పోర్ట్ మరిచిపోయి విమానాశ్రయానికి వచ్చేసారని మీడియాలో వార్తలు వచ్చేసాయి. మేము ఆయన ఇంటి నుండి టికెట్, పాస్ పోర్ట్, వ్యక్తిగత సామాను వంటివన్నీ సకాలంలోనే తీసుకువచ్చి అందించి ఆయనను విమానం ఎక్కించి పంపాము,” అని ఆయన తెలిపారు.

అవ్వ పేరే బామ్మ…బామ్మ పేరే అవ్వ అన్నట్లుగా ఏదయితేనేమి రజనికాంత్ విమానాశ్రయం చేరుకోనేసరికి ఆయన చేతిలో పాస్ పోర్ట్ లేదు. కనుక ఎదురు చూసారు. అవి రాగానే విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఆయన ప్రముఖుడు గాబట్టి ఈ విషయం మీడియాలోకి వచ్చింది అంతే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close