కోడెలను ‘బ్రేకింగ్‌పాయింట్‌’ దాక్కా లాక్కెళ్లారు!

శాసనసభ సభాపతి స్థానం అంటే అది గౌరవప్రదమైన, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవి. ఆ దపవిలో ఉన్నది ఎవ్వరైనా సరే.. ఆ సమున్నతమైన గౌరవానికి అర్హులు. రాజకీయ నాయకులు కూడా ఇతర పార్టీలకు చెందిన వారైనా ఆ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల అగౌరవంగా మాట్లాడడం తగదు. అలాగే ఆ పదవిలో ఉన్నవారు రాజకీయంగా తన-పర భేదాలను విడచి వ్యవహరించాలి. కానీ నవతరం రాజకీయాల్లో నిర్వచనాలు మారిపోతున్నాయి. స్పీకరు స్థానంలోకి వచ్చినంత మాత్రాన పార్టీ రంగును పులుముకోకుండా నాయకులు ఉండలేకపోతున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల విషయానికే వస్తే.. స్పీకరు వంటి రాజ్యాంగపదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పసుపు కండువాలు వేసుకుని పాల్గొనడం చాలా వివాదాలకు దారితీసింది. ఆరకంగా విలువలను స్పీకర్లు గాలికొదిలేస్తున్నట్లే.. స్పీకరును గౌరవించాలనే ధర్మాన్ని కూడా విపక్ష నాయకులు తుంగలో తొక్కేస్తున్నారు. తాజాగా చంద్రబాబును నేరగాడిగా అభివర్ణించే ప్రయత్నంలో ఆయన చుట్టూ అంతా నేరగాళ్లే ఉన్నారని ఆరోపించే ప్రయత్నంలో విపక్షనేత వైఎస్‌ జగన్‌ , స్పీకరు కోడెల శివప్రసాద్‌ను కూడా నేరగాడిగా అభివర్ణించి కొత్త వివాదానికి తెరతీశారు. ఒక రకంగా ఈ చర్య ద్వారా జగన్‌, కోడెలను బ్రేకింగ్‌ పాయింట్‌ దాక్కా లాక్కువెళ్లారని అనిపిస్తున్నది.

స్పీకరు స్థానంలోకి వచ్చిన తర్వాత.. రెగ్యులర్‌ రాజకీయ నాయకుడిలాగా వ్యక్తుల మీద వ్యక్తిగత నిందారోపణలతో ఎన్నడూ మాట్లాడకుండా కోడెల జాగ్రత్తగానే ఉన్నారు. కానీ తాజా పరిణామాల్లో ఆయన జగన్‌ మీద చాలా దారుణమైన ప్రతి విమర్శలకు దిగడం విశేషం. దేశం మొత్తం మీద వారానికి ఒకసారి కోర్టుకు వెళ్లివస్తూ ఉండే నేత జగన్‌ కూడా తన గురించి విమర్శలు చేస్తారాఅంటూ స్పీకర్‌ నిప్పులు చెరిగారు. జగన్‌ క్రిమినల్‌లా మాట్లాడుతున్నారని.. రాజనీతిజ్ఞుడిలాగా వ్యవహరించడాన్ని నేర్చుకోవాలని హెచ్చరించారు. సభాపతి అయిన తర్వాత గత 20 నెలల కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో జగన్‌ గురించి తాను మాట్లాడలేదంటూ కోడెల చెప్పడం గమనార్హం.

తుని దుర్ఘటనల ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని.. ఎంతో సహనంతో వ్యవహరించే ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఉద్వేగానికి గురరిచేసినది జగనే అంటూ కోడెల సభాపతిలా కాకుండా సాధారణ రాజకీయ నాయకుడిలా ఆరోపణలు చేయడం విశేషం. అందుకే కోడెలను బ్రేకింగ్‌ పాయింట్‌ వరకు లాక్కువెళ్లారా అని అనుకోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close