సుకుమార్ తెగ వాడేస్తున్నాడుగా!

సుకుమార్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించిన ‘కుమారి 21’ మంచి లాభాల్ని ఆర్జించింది. సినిమా బాగుండ‌డంతో పాటు, సుక్కు మార్క్ ఆ సినిమాపై ప‌డ‌డంతో… బాక్సాఫీసు ద‌గ్గ‌ర అనుకొన్నదానికంటే బాగా మెర‌వ‌గ‌లిగింది. ఇప్పుడు అదే స్ట్రాట‌జీ ‘ద‌ర్శ‌కుడు’ సినిమా విష‌యంలోనూ పాటిస్తున్నాడు సుకుమార్‌. త‌న స్నేహితుడు హ‌రి ప్ర‌సాద్ జ‌క్కా ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సినిమా ఎప్పుడో పూర్త‌యింది. మంచి రిలీజ్ డేట్ కోసం చిత్ర‌బృందం ఎదురుచూస్తోంది. ఈలోగా ప్ర‌మోష‌న్ల‌ను కూడా జోరుగా చేస్తోంది. టీజ‌ర్‌ని.. ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుద‌ల చేయించాడు సుక్కు. ఇప్పుడు ఆడియో ఫంక్ష‌న్‌కి రామ్ చ‌ర‌ణ్ ని తీసుకొస్తున్నాడు. శ‌నివారం హైద‌రాబాద్‌లో ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంది. ఈ వేడుక‌కు చ‌ర‌ణ్ అతిథిగా వ‌స్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, స‌మంత‌ల‌తో ఒక్కో పాట విడుద‌ల చేయించాడు సుక్కు. ఇక మిగిలింది మ‌హేష్ బాబునే. త‌న‌తో కూడా ఓ ప్ర‌మోష‌న్ ఈవెంట్ చేయించాలని ఫిక్స్ అయ్యాడు సుక్కు. మ‌రి మ‌హేష్‌ని ఎలా వాడుకొంటాడో. మొత్తానికి త‌న‌తో సినిమాలు చేసిన‌వాళ్లంద‌రినీ ఏదో ఓ రూపంలో ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ లోకి తీసుకొస్తున్నాడు సుక్కు. దాంతో చిన్న సినిమా అయినా. భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్ దొరుకుతోంది. దాన్ని ఈ ‘ద‌ర్శ‌కుడు’ ఎంత వ‌ర‌కూ ఉప‌యోగించుకొంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.