‘సైరా’ వివాదంపై స్పందించిన చ‌ర‌ణ్‌

ఓ ప‌క్క ‘సైరా’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే, మ‌రోవైపు వివాదాలూ త‌గ్గ‌డం లేదు. ‘సైరా’ విష‌యంలో మాకు అన్యాయం జ‌రిగింద‌ని ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వంశ‌స్థులు వివాదాన్ని రాజేశారు. అది అలా ర‌గులుతూనే ఉంది. ఈ విష‌యం కోర్టులో ఉండ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ మాట్లాడ‌లేదు. తాజాగా ఈ విష‌యంపై చ‌ర‌ణ్ స్పందించాడు. వందేళ్లు దాటితే ఎవ‌రి కథైనా చ‌రిత్ర అవుతుంద‌ని, దాన్ని సినిమాగా మ‌ల‌చుకునే హ‌క్కు అంద‌రికీ ఉంటుంద‌ని చ‌ర‌ణ్ గుర్తు చేశాడు. ఈ విష‌యంలో ఇది వ‌ర‌కు న్యాయ‌స్థానాలు ఇచ్చిన తీర్పుని చ‌ర‌ణ్ ఉటంకించాడు.

మంగ‌ళ‌పాండే క‌థ‌ని సినిమాగా తీస్తున్న‌ప్పుడు కూడా ఇలాంటి వివాదాలే వ‌చ్చాయ‌ని, కానీ అవేం నిల‌బ‌డ‌లేద‌న్నాడు చ‌ర‌ణ్‌. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి దేశం కోసం పోరాడార‌ని, అలాంటి వ్య‌క్తిని ఓ గ్రామానికో, కుటుంబానికో ప‌రిమితం చేయ‌డం ఇష్టం లేద‌ని, సైరా త‌ర‌పున ఏమైనా చేయాల్సివ‌స్తే – ఆ గ్రామానికి స‌హాయం చేస్తామ‌ని చ‌ర‌ణ్ ప్ర‌క‌టించాడు. వంద‌ల కోట్లు ఉన్నంత మాత్ర‌న ఇలాంటి సినిమాలు రావ‌ని, చ‌రిత్ర‌పై గౌర‌వం ఉన్న‌ప్పుడే `సైరా`లాంటి చిత్రాలు రూపుదిద్దుకుంటాయ‌న్నాడు చ‌ర‌ణ్‌. ఈ వ్యాఖ్య‌ల‌తో ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి వంశ‌స్థుల‌కు `సైరా` బృందం చేసేదేం లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. మ‌రి ఇప్పుడు వాళ్లంతా ఏ వైపుగా అడుగులు వేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close