ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్ప‌టికే ఈ రంగంలోకి అడుగు పెట్టేశారు. ఇప్పుడు హీరోల వంతు వ‌స్తోంది.

త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఓ వెబ్ సిరీస్ మొద‌లు కానున్న‌ద‌ని స‌మాచారం. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో చ‌రణ్ సినిమాల్ని నిర్మిస్తున్నాడు. ఖైదీ నెం.150, సైరా, ఆచార్య చిత్రాల‌కు త‌నే నిర్మాత‌. ఇప్పుడు చ‌ర‌ణ్ ఓ వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచ‌న‌ల్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. భారీ స్టార్లు, సినిమాని మించే బ‌డ్జెట్‌తో.. ఈ వెబ్ సిరీస్‌ని తెర‌కెక్కించాల‌న్న ఆలోచన‌లో ఉన్నాడ‌ట‌. ఇది ఆహా కోస‌మా? మ‌రో ఓటీటీ వేదిక కోస‌మా? అనేది తెలియాల్సివుంది. ఈమ‌ధ్య చిరు కూడా వెబ్ సిరీస్‌ల‌పై ఆస‌క్తి క‌ర‌బ‌రిచాడు. మంచి కంటెంట్ ఉంటే, త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని చెప్పాడు. బ‌హుశా.. చ‌ర‌ణ్ ప్లానింగ్ కూడా చిరంజీవి కోస‌మేనేమో. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పెట్టిందే చిరు కోస‌మ‌ని చ‌ర‌ణ్ చాలాసార్లు చెప్పాడు. ఆ ప్రొడ‌క్ష‌న్స్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతోందంటే.. చిరు లేకుండా ఎలా? మ‌రి చ‌ర‌ణ్ ప్లానింగ్ ఏమిటో? ఈ వెబ్ సిరీస్ స్పెషాలిటీ ఏమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close