ఏపీ ఆలయాల్లో దేవుడ్నే లెక్క చేయడం లేదంటున్న రమణదీక్షితలు !

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఏపీలో ఆలయాల పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని.. ఆలయ అధికారులు వారి ప్రణాళికలు, వారి కల్పనలు అమలు చేస్తున్నారని ఆరోపిచారు. ప్రముఖులకు., పారిశ్రామిక వేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారింది అంటూ రమణ దీక్షితులు. ట్వీట్ చేశారు. తమిళనాడు ఆలయాల్లో పరిస్థితులపై ఓ తమిళనాడు భక్తుడు పట్టిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ఏపీలోనూ అలాగే ఉందన్నారు.

రమణదీక్షితులు లెక్క ప్రకారం ఏపీలో అసలు ఆలయాల్లో పూర్తి స్థాయిలో దేవుడ్నిలెక్క చేయడం మానేశారు. ఆగమ శాస్త్రాలను పట్టించుకోవడం లేదు. మరి ఇంత జరగుతున్న ఆయన కేవలం ట్వీట్ రిప్లయ్ లకే ఎందుకు పరిమితమయ్యారన్నది ఆయనకే తెలియాలి. టీటీడీ ఆగమ శాస్త్ర సలహాదారుడు కూడా ఆయనే. మరి అలాంటప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా అంటే.. ఆయన దగ్గర సమాధానం ఉందో లేదో ఎవరికీ తెలియదు.

టీటీడీ ప్రధాన అర్చకుడిగా … శ్రీవారికి రోజూ పూజలు చేసే భాగ్యం దక్కించుకున్న ఆయన… శ్రీవారి ఆలయప్రతిష్ట మంటగలిపేలా తప్పుడు ఆరోపణలు రాజకీయ పరంగా చేశారు. పింక్ డైమండ్.. పోటులో తవ్వకాలు అంటూ.. దారుణమైన అభాండాలు వేశారు. దానికి ఆయన పదవి పోయింది. ఆయన ఎవరిని నమ్ముకుని ఆ ఆరోపణలు చేశారో వారిప్పుడు నట్టేట ముంచేశారు. చివరికి పదవి పోయింది.. ఆలయంలోకి రానిచ్చే వారు లేకుండా పోయారు. దీంతో ఆయన ప్రభుత్వంపై ఇలా అసంతృప్తి ట్వీట్లు వేస్తూ టైం పాస్ చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐదేళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికే జనాల్లోకి జగన్ !

పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన...

తుండు రివ్యూ: కాపీ కొట్ట‌డం ఎలా?

Thundu movie review ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వ‌చ్చాక‌... ఆ భాష‌లో సినిమాల్ని స‌బ్ టైటిల్స్ తో చూసే బాధ త‌ప్పాక‌, తెలుగు డ‌బ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మ‌రింత...

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close