పెగాసస్ నిఘా పెట్టారని కనిపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే !

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై ప్రభుత్వం పెగాసస్ ప్రయోగించిందని ఆరోపిస్తున్నారు తన ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయని తనపై నిఘా కోసమే ప్రత్యేకంగా ముగ్గురు అధికారుల్ని పెట్టారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా సీఎం జగన్మోహన్ రెడ్డి మీదనే. ఆయన నేరుగా చెప్పకపోయినా పెగాసస్ వాడేది.. నిఘా పెట్టేది ప్రభుత్వమే. వీరందరికీ కోటంరెడ్డి తనదై నశైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను పన్నెండు సీక్రెట్ సిమ్ లు .. ఫోన్లు మెయిన్ టెయిన్ చేస్తున్నానని.. ఫేమ్ టైమర్, టెలిగ్రామ్ యాప్ లలో మాట్లాడుకుంటే రికార్డు చేయలేరని ఆయన ప్రకటించారు. తనపై నిఘా కోసం ప్రత్యేకంగా ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టుకోవచ్చని సలహా ఇచ్చారు.

క్రికెట్ బెట్టింగ్ కేసుల సమయంలో.. అప్పటి ఎస్పీ తన ఫోన్‌పై నిఘా ఉంచారన్నారు. ఈ సమాచారం తనకు తెలియడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడేవాడినని తెలిపారు. 30 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడెలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అయినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. తాను రాజకీయ వారసత్వంతో ఎదగలేదని, స్వతహాగా పోరాటాలతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని ఆరోపణలు చేశారు.

తనకు రాజకీయంగా అవకాశాలు వచ్చినా.. ఆ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వాళ్లే అనుభవిస్తున్నారని.. ఇకపై ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు. తాను రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని.. తాను సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని.. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. మొత్తంగా కోటంరెడ్డి … వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close