రమణదీక్షితుల గోడును జగన్ ఆలకించరా..!?

శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు …. మళ్లీ తన పదవి కోసం.. సీఎం జగన్ పై అన్ని రకాల వ్యూహాలు పన్నుతున్నారు. కానీ వర్కవుట్ కావడం లేదు. గతంలో అసంతృప్తి స్వరాన్ని..తిరుగుబాటు హెచ్చరికల్ని చేసి.. చేసి అలసిపోయిన ఆయన ఇప్పుడు.. సీఎంగారూ.. మీరే న్యాయం చెప్పాలంటూ.. ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా తనను నియమించమని మీరు టీటీడీ అధికారులను ఆదేశించినా… బేఖాతరు చేస్తున్నారని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. తనను గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని కానీ తాను ఆ పదవిని తిరస్కరించానని చెప్పారు.

ఈ విషయంలో వెంటనే స్పందించి మీ ఆదేశాలను టీటీడీ అధికారులు వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. రమణదీక్షితులు… ఓ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. రమణదీక్షితులకు గౌరవ ప్రధాన అర్చకులు పదవి మాత్రమే ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ పదవి ఇచ్చారు. టీటీడీ చైర్మన్‌గా ఉన్నది… స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువే. వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టే వ్యూహకర్తల్లో ఒకరు. ఆయనే అలా నియమించారంటే..జగన్ మోహన్ రెడ్డి ఆ పదవి వరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అర్థం. అయితే.. ఈ విషయం అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు రమణద దీక్షితులు.

అందుకే నిన్న మొన్నటిదాకా ఆయన… కాస్త హెచ్చరిక స్వరంతో.. తిరుగుబాటు చేస్తామన్నట్లుగా… ట్వీట్లు పెట్టారు. సుబ్రహ్మణ్యస్వామితో కలిసి.. టీటీడీని ప్రభుత్వం నుంచి తప్పించేలా న్యాయపోరాటం చేస్తున్నట్లుగా ట్వీట్ల ద్వారా సందేశం పంపారు. అవేమీ వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు బతిమాలుకోవడానికి వచ్చారని అంటున్నారు. అయితే.. నేరుగా కలిసే అవకాశం రమణదీక్షితులకు లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు.. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ మంత్రులకే దొరకదు.. ఇక రమణదీక్షితులకేమి దక్కుతుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close