చిరంజీవి సౌమ్యంగా వుంటారేమో.. మేము కాదు: రామ్ చరణ్

వాల్తేరు వీరయ్య సక్సెస్ వేడుకలో రామ్ చరణ్ పాల్గోవడం మెగా ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చింది. వరంగల్ లో జరిగిన వేడుకలో ఫ్యాన్స్ ఉత్సాహపరుస్తూ మాట్లాడారు చరణ్. ‘’ నేను ఇక్కడి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడి వచ్చాను’’ అన్నారు. ‘’వాల్తేరు వీరయ్య చూశాను. బాబీ ఇరగదీశాడు. ప్రతి ఫ్రేం ప్రేమతో నింపేశాడు. చిరంజీవి గారు మా నాన్న గారి లేరు.. మా బ్రదర్ లా వున్నారు. రవితేజ గారి ఒక డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దానిని కూడా మేము ఎంజాయ్ చేసేలా చేశాడు బాబీ. నిజంగా పూనకాలు లోడింగ్. నాతో పాటు అభిమానులందరికీ వాల్తేరు వీరయ్య గుర్తుండిపోయే చిత్రం.’’ అన్నారు.

ఇదే సందర్భంలో మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఈ మధ్య చిరంజీవి అతి మంచితనం గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఎన్ని విమర్శలు చేసిన ఆయన చాలా నెమ్మదిగా సర్దుకుపోతున్నారని, కనీస ప్రతివిమర్శ చేయడం లేదని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే టాపిక్ ని చరణ్ ప్రస్థావించాడు. ‘’చిరంజీవి గారు చాలా సౌమ్యులు అని అంటారు. ఆయన బిగించి మాట్లాడితే ఏమౌతుందో చాలా మందికి తెలీదేమో. వాళ్ళందరికి చిరంజీవి గారు నెమ్మదిగా సౌమ్యంగా వుంటారేమో గానీ మేము కాదు. నెమ్మదిగానే చెబుతున్నాం మేము నెమ్మదిగా ఉండం’’ అని స్వీట్ కామెంట్ వదిలారు చరణ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close