ఏపీ సర్కార్‌పై నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ అస్త్రం..!

తనను స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగించాలనే తీర్పును ఏపీ సర్కార్ అమలు చేయడం లేదంటూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ.. తాను విధుల్లో చేరే విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని నిమ్మగడ్డ రమేష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీని, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శిని, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కొద్ది రోజుల కిందట.. ఎస్‌ఈసీగా ఉన్న రమేష్‌కుమార్‌ను తొలగించేలా ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఆ అర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేసింది. రమేష్‌కుమార్‌ను పునర్‌నియమించాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజునే నిమ్మగడ్డ చార్జ్ తీసుకున్నారు. ఆ మేరకు ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సర్క్యూలర్ కూడా రిలీజయింది. అయితే.. తర్వాతి రోజు.. హైకోర్టు తీర్పునకు కొత్త అర్థం చెబుతూ.. అడ్వకేట్ జనరల్ ప్రెస్‌మీట్ పెట్టారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం చెల్లదని..అందుకే.. సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నామని .. ఇదే అభిప్రాయాన్ని న్యాయసలహాగా ఏపీ ప్రభుత్వానికి చెబుతున్నామన్నారు. దాంతో.. ఏపీ సర్కార్ నిమ్మగడ్డ చార్జ్ తీసుకోవడాన్ని ఉపసంహరిస్తూ.. మరో ఉత్తర్వ జారీ చేయించింది. ఈ కారణంగా హైకోర్టు తీర్పు ఇచ్చినా నిమ్మగడ్డ విధుల్లో చేరలేకపోయారు. ఏపీ ప్రభుత్వం ఓ సారి… ఎన్నికల సంఘం కార్యదర్శి ఓ సారి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి.. ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే కోరారు. కానీ సుప్రీంకోర్టు ఇవ్వలేదు.

హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం.. కోర్టు ధిక్కరణే అన్న చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది. సుప్రీంకోర్టులో వచ్చే నిర్ణయాలను బట్టి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాలన్న ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇన్ని రోజులూ… తన పిటిషన్ వేయకుండా ఎదురు చూశారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడంతో.. హైకోర్టు తీర్పును అమలు చేస్తుందేమో అనుకున్నారు. కానీ రెండు సార్లు సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోయినా… ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశంలో లేకపోవడంతో.. చివరి ప్రయత్నంగా.. కోర్టు దిక్కరణ పిటిషన్ వేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close