గౌత‌మ్ మీన‌న్‌కి ఇదే బాగున్న‌ట్టుంది

క్లాస్ ట‌చ్ ఉన్న ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్‌. అయితే చాలా కాలంగా ఆయ‌న‌కు హిట్స్ లేవు. తీసింద‌ల్లా ఫ్లాపే. ఆయ‌న త‌న ట‌చ్ కోల్పోయి.. ఏదేదో తీస్తున్నాడు. అయితే… త‌న కెరీర్ ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. న‌టుడిగా.. పుష్క‌ల‌మైన అవ‌కాశాలొస్తున్నాయి. ఇటీవ‌లే ‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించారాయ‌న‌. ఆ పాత్ర‌కు మంచి పేరొచ్చింది. అప్ప‌టి నుంచీ ఆ త‌ర‌హా సీరియ‌స్ రోల్స్ గౌత‌మ్ మీన‌న్ ని వెదుక్కుంటూ వెళ్తున్నాయి. `ట్రాన్స్‌’ అనే మలయాళ చిత్రంలో విలన్‌గా న‌టించారు గౌత‌మ్‌. ఆ సినిమాలో న‌ట‌న‌కూ కితాబులు అందుకున్నాడు. అటు త‌మిళ‌, క‌న్నడ చిత్రాల నుంచి వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తెలుగులోనూ ఇలాంటి అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్నాడు గౌత‌మ్‌. కొంత‌మంది న‌టులు.. త‌ర‌వాతి కాలంగా ద‌ర్శ‌కులుగా మారి, అక్క‌డే బిజీ అయి, స్థిర‌ప‌డ‌తారు. కానీ ద‌ర్శ‌క‌త్వం నుంచి న‌ట‌న వైపుకొచ్చి, అందులో సెటిలైన‌వాళ్లు చాలా త‌క్కువ‌. కానీ.. గౌత‌మ్ ని చూస్తుంటే, న‌టుడిగా సెటిలైపోవ‌డానికి డిసైడ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.

“నాలో న‌టుడున్నాడ‌న్న సంగ‌తి నాకు నిజంగా తెలీదు. స‌ర‌దాగా కొన్ని ప్ర‌య‌త్నాలు చేశాను. అవ‌న్నీ నా మ‌న‌సుకి న‌చ్చాయి, ప్రేక్ష‌కుల‌కూ న‌చ్చాయి. న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం ఏదైనా స‌రే, సినిమాలో భాగ‌మే క‌దా. అందుకే న‌ట‌న‌నీ ఆస్వాదిస్తున్నా” అంటున్నాడు గౌత‌మ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close