దేశంలో రోజూ 90 రేప్‌లు…ఇదీ సర్కారువారి లెక్క…!

కొన్నాళ్లుగా జనమంతా అత్యాచారాల గురించే మాట్లాడుకుంటున్నారు. పొద్దున్నే లేవగానే అత్యాచారాల గురించి మాట్లాడుకునే, సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, పత్రికల్లో రేప్‌ల గురించి చర్చించుకునే పరిస్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టమే. కాని తప్పడంలేదు. దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు రాజధానిగా మారిందని కాంగ్రెసు నాయకుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. కాని ఢిల్లీయే కాదు, దేశమే అత్యాచారాలకు రాజధానిగా మారిందని చెప్పుకోవచ్చు. భారత్‌ను గురించి ఎవరైనా మాట్లాడుకుంటే ఇది అత్యాచారాలకు నిలయమని, ఇక్కడ చిన్నపిల్లలు సహా మహిళలకు రక్షణ లేదని తప్పనిసరిగా మాట్లాడుకుంటారు. చట్టాలు, కోర్టుల ద్వారా బాధితులకు న్యాయం జరగదని, నేరగాళ్లకు శిక్షలు పడవని జనం గట్టిగా అభిప్రాయపడుతున్నారు.

నేరగాళ్లను తమకైనా అప్పగించాలని లేదా ఎన్‌కౌంటర్‌ చేసో, మరోవిధంగానో చంపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత ఈ డిమాండ్‌ ఊపందుకుంది. సామాన్యులే కాదు, అత్యున్నత అవార్డులు అందుకున్నవారు, వివిధ రంగాల్లో ప్రముఖులు సైతం ఇదే డిమాండ్‌ చేస్తున్నారంటే న్యాయవ్యవస్థ మీదనే నమ్మకం పోతోందని అనుకోవాలి. ఇదిలావుంటే దేశంలో రోజుకు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కేవలం అత్యాచారం చేసి ఊరుకోవడంలేదు. ఆ తరువాత చంపేస్తున్నారు. నెలల పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు దారుణమైన అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారు.

ప్రతి పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని ఈమధ్య టీవీ చర్చలో ఒకాయన చెప్పాడు. ఏ గణాంకాలైనా నూటికి నూరు శాతం కరెక్టుగా ఉండవు. దేశంలో రోజుకు 90 అత్యాచారాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది. ఇవి ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారం కట్టిన లెక్క. కాని వివిధ కారణాలతో పోలీసు స్టేషన్లలో నమోదుకాని అత్యాచారాలు ఎన్నో ఉంటాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2017లో 32,500 అత్యాచారాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 18,300 కేసుల్లో మాత్రమే కోర్టు తీర్పులు వచ్చాయి. తీర్పులు వచ్చినప్పటికీ ఎన్ని కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయో లెక్కలు లేవు.

అదే ఏడాదిలో 1,27,800 కేసులు (పాత కేసులు కలుపుకొని) పెండింగులో ఉన్నాయి. 2018, 2019 లెక్కలు ఏమిటో తెలియరాలేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ ఘటన గురించి తెలిసే ఉంటుంది. ఈ ఘటనలో బాధితురాలిని జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మరి కొందరితో కలిసి హత్య చేశాడు. బాధితురాలిని నిలువునా మంటల్లో తగులబెట్టేశాడు. తాజాగా కాంగ్రెసు నాయకురాలు ప్రియాంక గాంధీ ఉన్నవ్‌లో పర్యటించినప్పుడు ఉన్నావ్‌ జిల్లాలో గత 11 నెలల్లో 90 అత్యాచారాలు జరిగాయని చెప్పారు. దీంతో జిల్లా ఎస్‌పి విక్రాంత్‌ వీర్‌కు కోపమొచ్చింది.

ప్రియాంక గాంధీ చెబుతున్న లెక్క తప్పంటూ ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి నవంబరు 30 వరకు 51 అత్యాచారం కేసులు నమోదయ్యాయని చెప్పాడు. 2018లో 64 కేసులు నమోదయ్యాయని, 2017లో 54, 2016లో 37,2015లో 39 కేసులు నమోదైనట్లు చెప్పాడు. ఈ కేసులన్నీ పోలీసు స్టేషన్లలో నమోదైనవి. జరిగినవి ఎన్ని? అవి పోలీసుల లెక్కకు అందవు. కొన్ని అత్యాచారం కేసుల్లో రాజకీయ నాయకులే ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close