రారండోయ్ ట్రైల‌ర్ : అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రం

సోగ్గాడే చిన్నినాయ‌న చిత్రంతో ఆక‌ట్టుకొన్నాడు క‌ల్యాణ్‌కృష్ణ‌. నాగార్జున‌కి త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందించాడు. ఆ న‌మ్మ‌కంతో నాగ‌చైత‌న్య‌ని కల్యాణ్ కృష్ణ చేతుల్లో పెట్టాడు నాగ్‌. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించింది. ఈనెల‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇప్పుడు థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. చైతూ, ర‌కుల్‌, జ‌గ‌ప‌తిబాబు, సంప‌త్‌.. ఈ నాలుగు పాత్ర‌లూ ఈ క‌థ‌కు కీల‌కం అని చిత్ర‌బృందం ముందే చెప్పేసింది. దానికి త‌గ్గ‌ట్టే ట్రైల‌ర్ క‌టింగులో కూడా ఈ నాలుగు పాత్ర‌ల్ని, వాళ్ల క్యారెక్ట‌రైజేష‌న్‌ని హైలెట్ చేశారు. ర‌కుల్ పాత్ర కాస్త డిఫ‌రెంట్‌గానే తీర్చిదిద్దిన‌ట్టు తెలుస్తోంది. కుటుంబ వాతావ‌ర‌ణం. చ‌క్క‌టి నేప‌థ్య సంగీతం, చివ‌ర్లో యాక్ష‌న్ ఎలిమెంట్స‌.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి ఈ చిత్రాన్ని కంప్లీట్ ప్యాకేలా తీర్చిదిద్దారనిపిస్తోంది. ట్రైల‌ర్ చూస్తుంటే కంటెంట్ ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఓ భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ చైతూకి అత్య‌వ‌స‌రం. అది ఈ చిత్రం అందించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. చివ‌ర్లో నాగ‌చైతన్య చెప్పిన డైలాగ్ అమ్మాయిలు మ‌న‌శ్మాంతికి హానిక‌రం కొన్ని రోజుల పాటు… చ‌క్క‌ర్లు కొట్ట‌డం త‌థ్యం. కావాలంటే ట్రైల‌ర్‌ని మీరూ ఓ లుక్కేయండి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.