జనం నవ్వుతారనే భయం లేని రావెల

మోకాలికి బొడిగుండుకి ముడి పెట్టడం అంటే ఇదే. కొడుకు పోకిరి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోతే అది కూడా ప్రతిపక్ష నేత జగన్ చేసిన కుట్ర అంటూ మంత్రి రావెల సమర్థించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవగింపు పుట్టిస్తున్నాయి. మన తెలుగు సినిమాలలో అడ్డంగా దొరికిపోయిన విలన్లు దాని గురించి చెప్పుకోవడానికి అడ్డగోలుగా ఇదంతా నాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర… అంటూ చెప్పే పస లేని డైలాగులను రావెల వ్యవహారం గుర్తుకు తెస్తోంది.

మంత్రి కొడుకు తాగిన మత్తులో ఒక వివాహితను వేధించడం, పర్యవసానంగా అరెస్టు కావడం అందరికి తెలిసిందే. ఇప్పటిదాక దొరికిన సాక్ష్యాధారాలను బట్టి రావెల కిషోర్ పుత్ర రత్నం సుశీల్ అంత సులువుగా బయటపడే అవకాశం కనిపించడం లేదు. అయితే సీసీ కెమెరాల ఫుటేజి సహా దొరికిపోతాడని మంత్రిగారు ఊహించినట్లు లేదు. కేసు గురించి మీడియాలో వార్తలు రాగానే ఇలాంటి తప్పులు ఎవరు చేసినా తాను ఖండిస్తానని మంత్రి రావెల చెప్పుకున్నారు.

ట్విస్టు ఏమిటంటే.. సీసీ కెమెరాల ఫుటేజి బయటకు రాగానే ఆయన స్వరంలో మార్పు వచ్చింది. దాని నుంచి తప్పించు కోవడం సాధ్యం కాదని అర్ధం అయిపోయిందో ఏమో గాని, అది మార్ఫింగ్ చేసిన ఫుటేజి అని ఇప్పుడు సెలవిస్తున్నారు. ఒక వైపు తన కుమారుడి పోకిరి వేషాలకు బలైన వివాహిత ఫాతిమా తన కూతురి లాంటిదని అంటూనే.. కొడుకు నిర్దోషిగా బయటకు వస్తాడని అంటున్నారు.

రాజకీయ ప్రత్యర్ధి అయినందుకు జగన్, తన పిల్లాడి జీవితాన్ని నాశనం చేసేలా ఇలాంటి కుట్రలు చేయడం కరెక్టు కాదు అంటున్నారు. కొడుకును దారిలో పెట్టుకోలేని తండ్రి.. ఇప్పుడు జగన్ మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే.. జనం నవ్వుతారని కూడా భయపడుతున్నట్లు లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close