జగన్ పరిపాలన రాయపాటికి భలే నచ్చేసింది..!

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు.. బీజేపీతో బేరం కుదిరినట్లుగా లేదు. ఆయన ఇప్పుడు వైసీపీపై దృష్టి సారించారు. జగన్మోహన్ రెడ్డి పాలన అత్యంత ఘోరంగా ఉందని.. తెలుగుదేశం పార్టీ.. రెండు నెలల్లోనే ప్రజాపోరాటాలకు శ్రీకారం చుట్టిన సమయంలోనే.. ఆయన వైఎస్ జగన్ పాలన బాగుందని.. సర్టిఫికెట్ జారీ చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ను సమర్థించడానికి… రాయపాటి.. కేంద్రంపై కూడా విమర్శలు చేశారు. జగన్ మంచిగా పరిపాలిస్తున్నా.. కేంద్రం నుంచి మాత్రం సహకారం అందడం లేదని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది త్వరలో ప్రకటిస్తానన్నారు. అంటే.. ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని అర్థం చేసుకోవచ్చు.

గతంలో… రామ్ మాధవ్ ఇంటికి వచ్చి మరీ పిలవడంతో… బీజేపీలో చేరేందుకు ఆయన రెడీ అయిపోయారు. కానీ.. ఆయన ఆశించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో మాత్రం.. బీజేపీ నుంచి.. పెద్దగా స్పందన రాలేదన్న ప్రచారం జరుగుతోంది. పైగా… తాను ఒక్కడ్నే బీజేపీలో చేరుతానని..కుటుంబసభ్యులంతా.. రాజకీయ భవిష్యత్ ఉండే పార్టీలో చేరుతారన్నట్లుగా.. ఆయన మాట్లాడటంతో.. బీజేపీ నేతలు రాయపాటిని లైట్ తీసుకున్నారు. అదే సమయంలో.. ఆయన రాజకీయ శత్రువు కన్నా… ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వైపు నుంచీ అడ్డంకులు ఎదురయినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇప్పటికిప్పుడు.. తన సమస్యలకు బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే పార్టీ కోసం.. రాయపాటి ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేయాలని… ఏపీ సర్కార్ నిర్ణయించిన నేపధ్యంలో… రాయపాటి వ్యాఖ్యలు ఆసక్తి కలిగించేవే. ఆయన వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నారని..తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. ఆయనను సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close