క్రికెట్ ప్రపంచంలో బ్యాడ్ లక్ అంటే దక్షిణాఫ్రికాదే అని చెబుతారు. ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ వన్ టీంగా… దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పుడు కూడా ఆ జట్టు చిన్న చిన్న తప్పిదాలతో క్రికెట్ ప్రపంచకప్ ను గెల్చుకోలేకపోయింది. ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాదో ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పటి వరకూ ఆ జట్టు ఖాతాలో ప్రపంచకప్ లేదు.
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదీ అదే పరిస్థితి. బెంగళూరు మొదటి నుంచి ఫేవరేట్ టీం. సూపర్ ఆటగాళ్లు.. కోహ్లీ లాంటి వజ్రం ఆ టీములో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆశలు రేపడం.. తర్వాత ఓడిపోవడం కామన్ అయిపోయింది. చివరిగా 9 ఏళ్ల కిందట ఫైనల్ చేరారు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం ఉంది. క్వాలిఫయర్ లో ఏకపక్షంగా గెలిచి ఫైనల్ చేరుకున్నారు. ఇంకొక్క అడుగు వేస్తే టైటిల్ అందుకుంటారు.
ఇప్పుడు ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తం రాయల్ చాలెంజర్స్ బెంగళూరే కప్ అందుకోవాలని అనుకుంటున్నారు. కనీసం కోహ్లీ కోసమైనా కప్ ఆ జట్టు గెలవాలని సగటు క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సారి ఫైనల్ రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ కి ఎవరు వస్తారు.. పంజాబా.. గుజరాతా.. ముంబైనా అన్నది మ్యాటర్ కాదు.. అన్ని జట్లపై ఈ టోర్నీలో బెంగళూరు మంచి ఆటతీరు కనబరిచింది.
కాని ఐపీఎల్ లో ఆర్సీబీకి ఇప్పటి వరకూ ఎదురవుతున్న దురదృష్టాన్ని చూసి.. చాలా మంది భయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలా కాకూడదని అనుకుంటున్నారు.