ఆన్‌లైన్‌ రియల్ఎస్టేట్ వ్యాపారంలో రికార్డ్: రు.6 కోట్ల ఫ్లాట్ అమ్మిన ‘స్నాప్‌డీల్’

హైదరాబాద్: రోజురోజుకూ విజృంభిస్తున్న ఆన్ లైన్ మార్కెట్ సత్తా ఏమిటో మరోసారి వెల్లడైంది. ఆన్ లైన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ రికార్డ్ నమోదయింది. ‘మంత్రి డెవలపర్స్’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరులో ఓ లగ్జరీ పెంట్ హౌస్ ఫ్లాట్ ను ‘స్నాప్‌డీల్’ ఆన్‌లైన్ వెబ్ సైట్ ద్వారా అమ్మింది. మన దేశంలో ఆన్ లైన్ రియాల్టీ డీల్స్ లో ఇదే అతి ఖరీదయిందని భావిస్తున్నారు.

‘మంత్రి ఎస్పానా’ అనే ఖరీదైన అపార్ట్ మెంట్ సముదాయంలోని పెంట్ హౌస్ ను పూర్ణిమ అనే మహిళ రు.6 కోట్లకు కొనుగోలు చేశారు. ఇ కామర్స్ లో ఎంతో పేరున్న స్నాప్ డీల్, గత ఏడాది ఆగస్టు నుంచి ఇళ్లను కూడా తన సైట్లో అమ్మకానికి పెట్టింది. టాటా వేల్యూ హోమ్స్, టాటా హౌసింగ్, డి.ఎల్.ఎఫ్., శోభా డెవలపర్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మంత్రి డెవలపర్స్ వంటి కంపెనీలు ఈ సైట్ ద్వారా ఇళ్లను అమ్ముతున్నాయి. స్పందన చాలా బాగుంది.

టాటా హౌసింగ్ కంపెనీ గత నెలలో ముంబైలో ఓ ఖరీదైన సేల్ జరిపింది. ఓ ఫ్లాట్ ను కోటీ 10 లక్షలకు స్నాప్ డీల్ ద్వారా అమ్మింది. అదే అతిపెద్ద ఆన్ లైన్ డీల్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు బెంగళూరు పెంట్ హౌస్ విక్రయం ద్వారా ఈ క్రెడిట్ ను స్నాప్ డీల్ సొంతం చేసుకుంది.

ఇండియాలో ఈ కామర్స్ భారీగా పెరుగుతుందని వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేసినప్పుడు చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి డీల్స్ గురించి విన్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది. నగరాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులే కాదు, మనిషికి కావాల్సిన సమస్త వస్తువులూ ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. చాలా వాటికి డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి కొత్త కొత్త ఈ కామర్స్ వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. దటీజ్ ఇండియా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close