సొంత వర్గానికే శ్రీవారిపై పెత్తనం..!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్న తిరుమల శ్రీనివాసుడు ఓ వర్గం కబంధ హస్తాల్లో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారినప్పటి నుంచి కొండపై జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్‌గా ఉండేవారు. టీటీడీ ఈవోగా శ్రీవారికి పరమ భక్తుడైన అశోక్ కుమార్ సింఘాల్‌ ఉండేవారు. టీటీడీ పాలన అంతా.. వీరిద్దరి చేతుల మీదుగానే సాగుతోంది. జేఈవోగా శ్రీనివాసరాజు కూడా కీలకంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. టీటీడీ చైర్మన్‌గా ఉన్న సుధాకర్ యాదవ్‌ను బలవంతంగా దించేశారు. జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్‌గా ప్రకటించారు.

బీసీని తీసేసి రెడ్డి సామాజికవర్గానికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంతోనే ఆగిపోలేదు. ఢిల్లీ నుంచి ధర్మారెడ్డి అనే అధికారిని డిప్యూటేషన్‌పై తీసుకు వచ్చి జేఈవోగా నియమించారు. ఈ ధర్మారెడ్డి గతంలోనూ అంటే.. వైఎస్ హయాంలోనూ జేఈవోగా నిర్వహించి వివాదాస్పద పరిస్థితుల్లో పదవిని వదిలిపెటాట్లిస వచ్చింది. ఆయన రాగానే సింఘాల్ ప్రాధాన్యం తగ్గింది. మొత్తం ధర్మారెడ్డి హవా ప్రారంభమయింది. అయితే ఇప్పుడు… సింఘాల్‌ను కూడా తొలగించేసి.. జవహర్ రెడ్డిని టీటీడీ ఈవోగా నియమించేశారు. దీంతో టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో అందరూ … రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే అయిపోయారు. ఇక జంబో పాలక మండలిలో ఆరేడుగురు రెడ్డి సామాజికవర్గ సభ్యులు ఉన్నారు.

శ్రీవారి అందరికీ ఆరాధ్యుడు. ఆయన సన్నిధిలో కొలువ చేయాలని.. సేవ చేయాని ఆరాటపడని అధికారికానీ భక్తులు కానీ ఉండరు. అయితే.. చాలా మంది ఇప్పుడు.. సేవ కంటే ఎక్కువగా.. ఏదేదో ఆశించి కొండ మీద తిష్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఈ విషయంలో శ్రీవారి పవిత్రతను గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుండంగా.. అస్మదీయులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా… రాష్ట్రంలో మరెవరూ లేనట్లుగా.. కొండపై ఒక్క వర్గమే తిష్ట వేసుకుని కూర్చుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే…ఏపీలో అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని.. ఒక్క టీటీడీలోనే కాదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close