‘రాక్షసుడు’ కు కష్టకాలం

టాలీవుడ్ లో ఒక చిత్రమైన సెంటిమెంట్ వుంది. ఓ సినిమా పెద్ద హిట్ అయితే తరువాత వచ్చే సినిమాలు అన్నీ సలాం కొట్టి పక్కకు తప్పుకున్నట్లు వచ్చి వెళ్లిపోతాయి. ఇస్మార్ట్ శంకర్ డేట్ కు రావాల్సిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు. కానీ ఇస్మార్ట్ శంకర్ రావడంతో రెండు వారాలు వెనక్కు వెళ్లిపోయింది.

ఇస్మార్ట్ శంకర్ వచ్చిన వారానికే క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది. టాలీవుడ్ సెంటిమెంట్, సినిమా ఎలా వుంటుందన్నది పక్కన పెడితే విజయ్ క్రేజ్ ఒక్కటి చాలు ఆ సినిమాను గట్టెక్కించేయడానికి. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వుంటాయి. ఆపైన సినిమా ఏమాత్రం బాగున్నా, ముందుకు వెళ్లిపోతుంది.

కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ పరిస్థితి అలాంటిది కాదు. ఎందుకంటే హీరో ఫుల్ గా డౌన్ లో వున్నారు. ఆ టైటిల్, కాంబినేషన్, జోనర్ ను బట్టి చూస్తే ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కూడా కాస్త కష్టమే. సినిమా ఎంతో బాగుంది అంటే తప్ప, నిల్చోవడం కష్టం. పైగా దానికి గుణ 369 సినిమా పోటీ వుంది.

ఇస్మార్ట్, డియర్ కామ్రేడ్ ల మాదిరిగా సోలో విడుదల కాదు. పైగా రాక్షసుడు వచ్చిన వారానికి నాగార్జున మన్మధుడు 2 సినిమా వచ్చేస్తోంది. అంటే ముందు వారాలు, వెనుక వారాలు కూడా ఫుల్ కాంపిటీషన్ నే. ఆగస్టు 15న శర్వానంద్ రణరంగం, అడవి శేష్ ఎవరు సినిమాలు వున్నాయి.

పోనీ బెల్లంకొండ రాక్షసుడు సినిమానే వాటి అన్నింటికి కాంపిటీషన్ అని అనుకోవచ్చు కదా? అనడానికి లేదు. ఎందుకుంటే విజయ్ దేవరకొండ, నాగార్జున, శర్వానంద్ లకు వున్న క్రేజ్ బెల్లంకొండకు ఇంకా రాలేదు. వరుస ఫ్లాపులు అతన్ని బాదపెడుతున్నాయి. పైగా రాక్షసుడు జోనర్ కూడా బాగా లిమిటెడ్. ఎంతో బాగుంది అంటే వీటిని తట్టుకుని నిల్చోడం చాలా కష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close