సాక్షి డైరెక్టర్లపై చర్యలకు హైకోర్టు స్టే!

తెదేపా నేతలు, మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో వేల ఎకరాలను కొనుగోలు చేసారంటూ సాక్షి మీడియాలో వరుస కధనాలు ప్రచురించినందుకు, కొన్ని రోజుల క్రితం తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర పొన్నూరు పోలీస్ స్టేషన్ లో సాక్షి సంపాదకుడు, డైరెక్టర్లపై పిర్యాదు చేసారు. జగన్ కి చెందిన సాక్షి పత్రిక రాజకీయ దుర్దేశ్యంతోనే నిరాధారమయిన వార్తలు, కధనాలు ప్రచురించిందని, దాని వలన తమ పార్టీకి, ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట కలిగిందని, కనుక వారిపై చర్యలు తీసుకోవలసిందిగా నరేంద్ర పోలీసులను కోరారు. ఆయన పిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తక్షణమే సాక్షి డైరక్టర్లు హైకోర్టుని ఆశ్రయించారు. రాజధాని ప్రాంతంలో తెదేపా నేతలు, మంత్రులు బినామీల పేర్లతో భూములు కొన్నట్లు దృవీకరించుకొన్న తరువాతే ఆ వివరాలను పత్రికలో ప్రచురిస్తే, పోలీసులు అధికార పార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తమపై కేసులు పెట్టారని, కనుక తమపై ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలని సాక్షి తరపున న్యాయవాది కోరారు. ఈ కేసుని విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ ఆయన అభ్యర్ధనను మన్నించి, సాక్షి డైరెక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పొన్నూరు పోలీసులకు నేడు ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ హైకోర్టు సాక్షి అభ్యర్ధనను మన్నించకపోయుంటే, అది వైకాపాకి దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ అయ్యుండేది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెదేపాకు కొంచెం నిరుత్సాహం కలిగే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close