జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి…ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్యతను క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేయనుందా..? అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికలు ప్రారంభమైన కొద్ది కాలం కిందటి వరకు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద బలమైన ఆయుధం లేకపోయిందన్నది విశ్లేషకుల మాట. ప్రజాస్వామ్య పరిరక్షణ – భారత్ జోడో అనే నినాదంతో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినా అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. ఇదే సమయంలో బీజేపీ మాత్రం పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించకపోగా..మతం పేరిట రాజకీయాలు చేసేలా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. మైనార్టీ పేరిట మెజార్టీల మనోభావాలను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేలా వ్యూహం ప్రకారం ముందుకు సాగింది.

ఈ క్రమంలోనే బీజేపీకి ముకుతాడు వేసేలా రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టాలంటే రిజర్వేషన్ల రద్దు అంశమే ప్రధాన ఎజెండా అవుతుందని.. ఇందుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఎజెండా కూడా రిజర్వేషన్ల రద్దు అంటూ ఆధారాలతో సహా నిత్యం జనాల్లో చర్చకు పెడుతున్నారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దును బలపర్చడమే అవుతుందంటూ ఆరోపిస్తున్నారు.

మోడీ, అమిత్ షాలను టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు చేస్తుండటంతో రేవంత్ వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో కూడా స్పేస్ దక్కుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు రేవంత్ ఓ అస్త్రాన్ని ఇచ్చారని.. ఇది కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మేలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యాంగంపై కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడినా రిజర్వేషన్ల రద్దు అంటూ రేవంత్ లేవనెత్తిన ఈ అంశం చుట్టే మూడు , నాలుగు రోజులుగా జాతీయ రాజకీయాలు తిరుగుతుండటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close