రాహుల్ గాంధీని తెలంగాణ టూర్‌కు తీసుకొస్తున్న రేవంత్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాస్త కదలిక తీసుకు వచ్చిన పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి మరింత జోష్ నింపేందుకు హైకమాండ్‌ను కూడా రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. దళిత, గిరిజన దండోరా సభను ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న రేవంత్ వచ్చే నెల 17వ తేదీన వరంగల్‌లో సభను ఖరారు చేశారు. ఆ సభకు రాహుల్ గాంధీ వచ్చేలా ఒప్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కూడా ధృవీకరించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తారని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హడావుడి ప్రారంభమయింది.

హైకమాండ్ నుంచి ఈ సభను ఓ బలప్రదర్శన వేదికగా రేవంత్ రెడ్డి వినియోగించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉండే ఆదరణను మరింతగా పెంచుకునేందుకు రేవంత్ వ్యూహం పన్నే అవకాశం ఉంది. ఉపఎన్నికలు ఎంత వాయిదా పడితే కేసీఆర్‌కు దళిత వర్గాల నుంచి అంతగా ఒత్తిడి వస్తుందనే రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. వచ్చే నెల పదిహేడో తేదీ లోపు హుజూరాబాద్‌లో పూర్తి స్థాయిలో పథకం అమలు చేయకపోతే.. ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ సభలో ప్రత్యేకంగా హైలెట్ చేసి.. కేసీఆర్ మోసం చేశారని ప్రకటించాలని భావిస్తున్నారు.

కొంత మంది కాంగ్రెస్ సీనియర్లు సహకరించకపోయినా రేవంత్ రెడ్డి కలసి వచ్చే వారితో పోరాటం చేస్తున్నారు. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఇంకా రేవంత్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. రాహుల్ గాంధీ వరంగల్ దళిత, గిరిజన దందోరాకు హాజరైతే.. వారంతా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అదే జరిగితే… వారిపై రేవంత్ రెడ్డి పై చేయి సాధించినట్లవుతుంది. రాహుల్ గాంధీ సభతో అటు రాజకీయంగా బలపడటం.. ఇటు పార్టీలోనూ మరింత పట్టు పెంచుకోవడం రేవంత్ రెడ్డికి సులువు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close