ఇక ప్రజలతో కలిసి తెరాసపై పోరాటాలకి రేవంత్ రెడ్డి రెడీ

సాక్షాత్ పార్టీ అధ్యక్షుడుకే పార్టీపై ఆసక్తి, దాని మనుగడపై అనుమానాలు ఉన్నప్పుడు ఇక ఆ పార్టీని రక్షించడం ఎవరి తరం? ఇది తెలంగాణాలో తెదేపాను ఉద్దేశ్యించి ఆ పార్టీ నేతలే అనుకొంటున్నా మాటలు. గ్రేటర్ ఎన్నికలు జరగడమే ఆలస్యం అన్నట్లు తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. మున్ముందు ఇంకా ఎంతమంది గోడ దూకేస్తారో తెలియదు కానీ చాలా మంది దూకేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకపోయినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం నిబ్బరం కోల్పోకుండా తెరాసతో ఒంటరి పోరాటం చేయడానికి సిద్దం అవుతుండటం మెచ్చుకోవలసిందే.

ఆయన ఇక నుండి నేరుగా ప్రజల మధ్యకే వెళ్లి స్థానిక సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో దత్తత తీసుకొన్న చిన్నముల్కనూరు గ్రామానికి స్వయంగా వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దాని రూపు రేఖలు పూర్తిగా మారిపోయి ఆ గ్రామం దశ తిరుగబోతోందని అందరూ భావించారు. కానీ అంత సంతృప్తికరంగా అభివృద్ధి జరుగలేదనే సంగతి రేవంత్ రెడ్డి గ్రహించారు.

ఆ తరువాత ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలబడి వారికి న్యాయం కల్పించడానికి ప్రభుత్వంతో పోరాటానికి సిద్దం అవుతున్నారు. స్థానిక పార్టీ క్యాడర్ ని వెంటబెట్టుకొని ప్రజలతో కలిసి పోరాటాలు చేయడం ద్వారా మళ్ళీ ప్రజల అభిమానం పొంది పార్టీని బలోపేతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి ఆయనతో పార్టీ నేతలు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారా లేకపోతే తెరాస వశీకరణ మంత్రానికి లొంగిపోయి తెరాసలో చేరిపోతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close