కేసీఆర్, కేంద్రం చేస్తున్న కుట్రలతోనే కేసులు: రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు చేస్తున్న కుట్రల కారణంగానే.. కేంద్రంతో కలిసి తనపై కేసులు పెడుతున్నట్లు… కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన ఇంటిపై జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటిని కుటుంబసభ్యులు కొనుగోలు చేశారని.. 2009 ఎన్నికల అఫిడవిట్‌కు.. 2014 ఎన్నికల అఫిడవిట్‌ ను పోల్చి చూడాలని ఆయన ప్రజలను కోరారు. 2009 తర్వాత తాను ఒక్క ఆస్తిని కూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. 2014లో కేంద్ర ఎన్నికల సంఘం మార్కెట్ విలువను మాత్రమే చెప్పాలని ఆదేశించిందని.. దాని ప్రకారమే.. ఆస్తులు ఎక్కువగా కనిపించాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. 2009కి.. 2014కి ఆస్తుల్లో ఎలాంటి తేడా లేకపోయినా.. మార్కెట్ విలువలో పెరుగదల వల్లే.. వ్యత్యాసం కనిపిస్తోందని స్పష్టం చేశారు.

తనపై ఎవరో చేసిన ఫిర్యాదు విషయంలో మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే తాను ప్రజలకు వివరణ ఇస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సింగపూర్, హాంకాంగ్, మలేషియాల్లో వ్యాపారాలు చేసినట్లు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని అంశాలను తనకు అంటగట్టి ప్రచారం చేశారన్నారు. తన ఇంటి అడ్రస్‌తో బినామీ కంపెనీలు ఉన్నాయని చెబుతున్నారని.. కానీ తన ఇంటిని ఇరవై మూడేళ్లుగా అద్దెకు ఇచ్చానని స్పష్టం చేశారు. అందులో నాలుగు అంతస్తులు ఉన్నాయని… అక్కడ అద్దెకు తీసుకున్న వాళ్లు..ఆ అడ్రస్‌తో కంపెనీని రిజిస్టర్ చేసుకుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. తనకు విదేశాల్లో బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతూండటంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారతీయ పౌరసత్వం కలిగిన వాళ్లు బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి..ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఓ సారి పరిశీలించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాంకాంగ్‌లో బ్యాంక్ అకౌంట్ అక్కడి పౌరులకు మాత్రమే ఇస్తారన్నారు. మలేషియాలో అంత కంటే కఠినమైన నిబంధనలే ఉంటాయని గుర్తు చేశారు.

తన పెళ్లి కంటే ముందే తన మామ కోటీశ్వరుడనే సంగతిని గుర్తు చేశారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు చిల్లర వ్యక్తులన్నారు. కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని.. కేసీఆర్ అధికారాన్ని నిలబెట్టుకునేందుకే తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ప్రగతి భవన్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల క్రితం.. రేవంత్ కు చెందిన 15 చోట్ల సోదాలు ప్రారంభించిన ఐటీ అధికారులు.. నిన్న తెల్లవారు జామున రెండున్నర గంటలకు ముగించారు. అక్టోబర్ మూడో తేదీన ఐటీ ఆఫీసులో హాజరు కావాలని రేవంత్ కు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close