చైతన్య : ప్రజలు డిసైడైతే అంతే !

ప్రభుత్వం వద్దనుకుంటే ప్రజలు ఏం చేస్తారో ప్రజాస్వామ్యం గురించి తెలిసిన వారందరికీ స్పష్టత ఉంటుంది. అయితే అధికార మదం తలకెక్కిన వారు అర్థం చేసుకోకపోవచ్చు. అధికారం పోయిన తర్వాత.. వారికి అసలు విషయం తెలుస్తుంది. ఈ విషయం విపక్ష పార్టీలకూ ఓ స్పష్టత ఉంటుంది. ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీ రాజకీయ పరిస్థితుల్లో ఇది ఇంకా ముఖ్యం అనుకోవచ్చు. ఏపీలో ప్రస్తుత రాజకీయం భిన్నంగా సాగుతోంది. కలిసి పని చేసే విషయంలో విపక్ష పార్టీలు ఇగో సమస్యలకు పోతున్నాయి. సీట్ల గురించి చర్చించుకోకుండానే బయట మాట్లాడేస్తున్నారు. ఇది ఆయా పార్టీల మధ్య విశ్వాసాన్ని తగ్గిస్తోంది.

ప్రభుత్వం వద్దనుకుంటే ప్రజలు ఒక పార్టీవైపే మొగ్గుతారు !

కొద్ది రోజుల కిందట పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకున్నారు. బలమైన ఇతర పక్షాలు ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇవ్వాలనుకున్నారు. అలాగే ఇచ్చారు. అందుకే ఏకపక్ష ఫలితాలొచ్చాయి. దేశ రాజకీయాల్లో వచ్చిన ఓ బలమైన మార్పుగా చూడవచ్చు. ప్రస్తుత అధికార పార్టీని ఎవరైతే ఓడించగలరో వారికి ప్రజలు పట్టం కడతారు.అందులో సందేహం ఉండదు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని ఉపయోగింంచుకోవాలి కానీ లేనిపోని రాజకీయం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది.

ఏపీలో ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకుంటున్నారు !

పది లక్షల మంది పట్టభద్రులు మెజార్టీ నియోజకవర్గాల నుంచి ఓట్లు వేశారు. ఇందులో కోస్తా ప్రాంతం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడప జిల్లా ప్రజలు కూడా తమ అభిమతం చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని విపక్షాలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని మళ్లీ లేవకుండా ప్రజాబలంతో కొట్టాల్సిన సమయం వచ్చింది. ప్రజా కంటక పాలన అని ప్రతి ఒక్కరూ అంటున్నారు కాబట్టి… ఏ స్థాయి విజయం సాధించాలనేది విపక్షాల తీరును బట్టే ఉంటుంది.

అతిశయానికి పోకుండా బలానికి తగ్గట్లుగా సర్దుబాటు చేసుకోవడమే రాజకీయం !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్వితీయ ప్రాధాన్య ఓట్లు ఎలా పని చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపక్షాలు కలిస్తే వచ్చే అడ్వాంటేజ్ అది. అయితే మా ఓటు వల్లే గెలుస్తామని ఆశ పడి అతిశయానితే … ఆ ఓటు వల్ల వాళ్లకీ ఉపయోగం ఉండదు. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం 23 మూడే. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చినా ఒక్క ఎమ్మెల్యేనే. ఇక్కడ ఓట్లు కాదు సీట్లు సాధించడం కూడా ముఖ్యమే. బలాలను అంచనా వేసుకుని రాజకీయ పార్టీలు అశకు.. అతిశయానికి పోకుండా రియాలిటీ రాజకీయం చేస్తే… ఏడాది తర్వాత వారి భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. లేకపోతే…..ఏం జరుగుతుందో ప్రజలు ఇప్పటికే శాంపిల్ గా చెప్పారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close